దేశంలోని అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan Yojana). ఇప్పటికే 21 విడతల ద్వారా పెట్టుబడి సాయం అందుకున్న కోట్లాది మంది రైతులు.. ఇప్పుడు 22వ విడత (22nd Installment) నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

ఎప్పుడు రావచ్చు?
అధికారికంగా ప్రభుత్వం తేదీని ప్రకటించనప్పటికీ.. గత విడతల ట్రెండ్ను బట్టి చూస్తే.. ఫిబ్రవరి 2026లో 22వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ డబ్బులు మీ ఖాతాలోకి సజావుగా రావాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులను గడువులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించబడే ప్రమాదం ఉంది.
నిధులు ఆగిపోకుండా ఉండాలంటే చేయాల్సిన 3 పనులు..
చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, చిన్న చిన్న పొరపాట్ల వల్ల డబ్బులు కోల్పోతున్నారు. మీ డబ్బులు ఆగకూడదంటే ఇవి చెక్ చేసుకోండి:
1. ఇ-కేవైసీ (e-KYC) తప్పనిసరి
పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఇ-కేవైసీ(eKYC)ని పూర్తి చేయాలి.
- మీరు స్వయంగా (pmkisan.gov.in)పోర్టల్కు వెళ్లి ఓటీపీ (OTP) ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు.
- ఒకవేళ ఆన్లైన్లో సాధ్యం కాకపోతే.. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయండి.
2. ఆధార్ - బ్యాంక్ ఖాతా లింక్ & DBT
డబ్బులు నేరుగా మీ ఖాతాలో పడాలంటే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ ఖాతాలో DBT ఆప్షన్ ఎనేబుల్ అయిందో లేదో మీ బ్యాంకుకు వెళ్లి సరిచూసుకోండి.
3. దరఖాస్తులో తప్పుల సవరణ
దరఖాస్తు చేసే సమయంలో పేరు స్పెల్లింగ్, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా భూమి వివరాలలో ఏవైనా చిన్న తప్పులు ఉన్నా మీ 22వ విడత ఆగిపోవచ్చు. వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకుని, ఏవైనా తప్పులు ఉంటే పోర్టల్లో సరిదిద్దుకోండి.
మీ పేరు జాబితాలో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
మీరు 22వ విడతకు అర్హులో కాదో తెలుసుకోవడానికి ఈ క్రింది పద్ధతిని అనుసరించండి..
- పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- 'Beneficiary Status' విభాగంపై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
- 'Get Data' పై క్లిక్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ క్లియర్ గా కనిపిస్తుంది.
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6,000లను మూడు విడతల్లో (రూ. 2,000 చొప్పున) నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ సాయం అందిస్తోంది. కాబట్టి పైన చెప్పిన పనులను వెంటనే పూర్తి చేసి.. 22వ విడత నిధులను పొందేందుకు సిద్ధంగా ఉండండి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications