దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) 21వ విడత డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు మీకోసం..

నవంబర్ 19 న పీఎం కిసాన్ 21 వ విడత డబ్బులు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులను ప్రధాని మోడీ తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా దాదాపు రూ. 18,000 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అర్హులైన ప్రతి రైతుకు రూ. 2,000 చొప్పున నిధులు అందుతాయి. దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా ఇప్పటివరకు 20 విడతలుగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ. 3.70 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారు.
డబ్బు జమ అవ్వాలంటే ఇలా చేయాలి
పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందడానికి అర్హులైన రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ eKYC పూర్తి చేసి ఉండాలి. ఇప్పటివరకూ ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఇలా చేయండి..
పీఎం కిసాన్ (pm kisan) పోర్టల్ లోకి వెళ్లి అక్కడ ఆధార్ నంబర్తో OTP ఆధారంగా eKYC పూర్తి చేయవచ్చు. లేదా మీకు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) లేదా స్టేట్ సేవా కేంద్రాలకు (SSK) వెళ్లి బయోమెట్రిక్ ద్వారా eKYC పూర్తి చేయొచ్చు. అలాగే పీఎం కిసాన్ మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా e-KYC చేయవచ్చు. అయితే దీనికంటే ముందుగా మీ భూమి వివరాలు పోర్టల్లో నమోదు చేసి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే చివరిగా eKYC పూర్తి అయి ఉండాలి.
మీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- మీకు 21వ విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి మీరు PM- Kisan వెబ్సైట్ (pmkisan.gov.in) ను విజిట్ చేయండి.
- హోమ్పేజీలో ఉన్న "Farmer's Corner" లోకి వెళ్లి "Know Your Status" అనే ట్యాబ్ లోకి వెళ్లాలి.
- అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన OTP ని ఎంటర్ చేస్తే.. మీ స్టేటస్ కనపిస్తుంది.
లబ్ధిదారుల లిస్ట్ ఎలా చూడాలి?
మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను ఆన్లైన్లో ఇలా చెక్ చేయవచ్చు
- ముందుగా PM కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) లో కి వెళ్లండి.
- అక్కడ 'Farmers Corner' లో 'Beneficiary List' పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం, జిల్లా, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేయండి.
- తర్వాత 'Get Report' పై క్లిక్ చేస్తే మీ గ్రామంలోని అర్హులైన రైతుల జాబితా కనిపిస్తుంది.
డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
మీరు స్టేటస్ చెక్ చేసినప్పుడు అక్కడ 'పెండింగ్' అని ఉంటే లేదా నిధులు జమ కాకపోతే మీ అప్లికేషన్ అసంపూర్తిగా ఉందని అర్థం. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే eKYC కూడా పూర్తి చేయండి. ఇవేమీ పని చేయకపోతే పీఎం కిసాన్ హెల్ప్ లైన్(155261 లేదా 011-24300606) నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications