PM Kisan 20th Installment date Latest Update: దేశంలోని రైతులకు మోదీ సర్కారు శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20 వ విడత చెల్లింపుపై అప్ డేట్ వచ్చేసింది.కాగా 19వ విడత నిధులు గతేడాది ఫిబ్రవరిలొ విడుదల కాగా ఈ సారి చాలా ఆలస్యమైంది. ఈ ఏడాది 20వ విడత డబ్బులు జూన్ నెలలో విడుదల అవుతాయని అంతా భావించారు. కాని విడుదల కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు..
అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. జూలై మొదటి లేదా రెండవ వారంలో పిఎం కిసాన్ యొక్క 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. కాగా ప్రతి సంవత్సరం మోదీ సర్కారు.. రైతులకు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లలో మూడు విడతలుగా రూ. 6,000 సాయం పెట్టుబడి కింద అందిస్తోంది. ఈసారి 19వ విడత ఫిబ్రవరిలో విడుదల చేసినా 20వ విడత తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం, జూలైలో ఒక కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ ఈ విడతను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

18వ విడత రైతులకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో నిధులు విడుదల కాగా.. 19వ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇవ్వబడింది. అప్పటి నుండి 4 నెలలకు పైగా గడిచాయి. PM కిసాన్ కింద, అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలల గ్యాప్లో రూ. 2,000 చొప్పున పొందుతారు.
ఈ నేపథ్యంలో రైతులు అలర్ట్ అయి తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. SMS రూపంలో నిధులు, OTP ధృవీకరణ, మీ ప్రస్తుత స్థితితో పాటు ఫిర్యాదుల పరిష్కారం వంటి సౌకర్యాలు PM కిసాన్ యోజనలో నమోదు చేయబడిన మొబైల్ నంబర్కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైతులు మీ నంబర్ అందుబాటులో లేకుంటే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
మీ మొబైల్ నంబర్ను ఎలా అప్డేట్ చేయాలి: ముందుగా రైతులు https://pmkisan.gov.in వైబ్ సైటుకి వెళ్లాలి. అక్కడ కనిపించే 'మొబైల్ నంబర్ అప్ డేట్' పై క్లిక్ చేయాలి. ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. కొత్త నంబర్ను నమోదు చేసి, OTPతో ధృవీకరించాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ విజయవంతంగా అప్ డేట్ అవుతుంది.
ఈ పద్దతిని ఆప్ లైన్ ద్వారా కూడా రైతులు చేయవచ్చు. మీరు సమీపంలోని CSC కేంద్రానికి లేదా వ్యవసాయ శాఖకు వెళ్లి ఆధార్, రిజిస్ట్రేషన్ నంబర్, కొత్త మొబైల్ నంబర్ను అందించడం ద్వారా మీరు అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రతి లబ్ధిదారునికి E-KYC తప్పనిసరి. లేకుంటే మీ పేరును లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది. మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, బ్యాంక్ ఖాతా నంబర్లో ఎటువంటి తప్పులు ఉండకూడదు. ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఒకే రైతు రెండుసార్లు నమోదు చేసుకుంటే ప్రయోజనాలు నిలిపివేస్తారు.
ఇక మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే..ముందుగా మీరు https://pmkisan.gov.in వైబ్ సైటులోకి వెళ్లండి. అక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. తరువాత రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయండి.అనంతరం e-KYC పూర్తయిందో లేదో, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో మీరు అక్కడ తనిఖీ చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications