PM Kisan 20th Installment date Latest Update: దేశంలోని రైతులకు మోదీ సర్కారు శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20 వ విడత చెల్లింపుపై అప్ డేట్ వచ్చేసింది.కాగా 19వ విడత నిధులు గతేడాది ఫిబ్రవరిలొ విడుదల కాగా ఈ సారి చాలా ఆలస్యమైంది. ఈ ఏడాది 20వ విడత డబ్బులు జూన్ నెలలో విడుదల అవుతాయని అంతా భావించారు. కాని విడుదల కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు..
అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. జూలై మొదటి లేదా రెండవ వారంలో పిఎం కిసాన్ యొక్క 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. కాగా ప్రతి సంవత్సరం మోదీ సర్కారు.. రైతులకు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్లలో మూడు విడతలుగా రూ. 6,000 సాయం పెట్టుబడి కింద అందిస్తోంది. ఈసారి 19వ విడత ఫిబ్రవరిలో విడుదల చేసినా 20వ విడత తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు కొన్ని నివేదికల ప్రకారం, జూలైలో ఒక కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ ఈ విడతను విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

18వ విడత రైతులకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో నిధులు విడుదల కాగా.. 19వ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇవ్వబడింది. అప్పటి నుండి 4 నెలలకు పైగా గడిచాయి. PM కిసాన్ కింద, అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలల గ్యాప్లో రూ. 2,000 చొప్పున పొందుతారు.
ఈ నేపథ్యంలో రైతులు అలర్ట్ అయి తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. SMS రూపంలో నిధులు, OTP ధృవీకరణ, మీ ప్రస్తుత స్థితితో పాటు ఫిర్యాదుల పరిష్కారం వంటి సౌకర్యాలు PM కిసాన్ యోజనలో నమోదు చేయబడిన మొబైల్ నంబర్కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. రైతులు మీ నంబర్ అందుబాటులో లేకుంటే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
మీ మొబైల్ నంబర్ను ఎలా అప్డేట్ చేయాలి: ముందుగా రైతులు https://pmkisan.gov.in వైబ్ సైటుకి వెళ్లాలి. అక్కడ కనిపించే 'మొబైల్ నంబర్ అప్ డేట్' పై క్లిక్ చేయాలి. ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. కొత్త నంబర్ను నమోదు చేసి, OTPతో ధృవీకరించాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్ విజయవంతంగా అప్ డేట్ అవుతుంది.
ఈ పద్దతిని ఆప్ లైన్ ద్వారా కూడా రైతులు చేయవచ్చు. మీరు సమీపంలోని CSC కేంద్రానికి లేదా వ్యవసాయ శాఖకు వెళ్లి ఆధార్, రిజిస్ట్రేషన్ నంబర్, కొత్త మొబైల్ నంబర్ను అందించడం ద్వారా మీరు అప్ డేట్ చేసుకోవచ్చు. ప్రతి లబ్ధిదారునికి E-KYC తప్పనిసరి. లేకుంటే మీ పేరును లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంది. మొబైల్ నంబర్, ఇంటి చిరునామా, బ్యాంక్ ఖాతా నంబర్లో ఎటువంటి తప్పులు ఉండకూడదు. ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. ఒకే రైతు రెండుసార్లు నమోదు చేసుకుంటే ప్రయోజనాలు నిలిపివేస్తారు.
ఇక మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే..ముందుగా మీరు https://pmkisan.gov.in వైబ్ సైటులోకి వెళ్లండి. అక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. తరువాత రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయండి.అనంతరం e-KYC పూర్తయిందో లేదో, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో మీరు అక్కడ తనిఖీ చేయవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications