ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది అతిపెద్ద కల. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, స్థలం ఖర్చుల వల్ల సామాన్యుడికి ఇది భారంగా మారుతోంది. ఈ కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం PM Awas Yojana (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) పథకాన్ని అమలు చేస్తోంది. పట్టణాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం కింద భారీ ఆర్థిక సాయం అందుతుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం ఈ పథకంలో కొన్ని కీలక మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

PM Awas Yojana ఎప్పుడు ప్రారంభమైంది?
కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల కోసం ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2016న ప్రారంభించింది. దీని రెండో దశ అయిన PMAY-U 2.0 సెప్టెంబర్ 1, 2024న రోల్ అవుట్ అయింది. రాబోయే ఐదేళ్లలో నగరాల్లో నివసించే EWS, LIG, MIG కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడమే ఈ ఫేజ్ ముఖ్య ఉద్దేశ్యం.
ఎవరికి ఎంత నగదు అందుతుంది?
ఈ పథకం కింద లబ్ధిదారులను వారి వార్షిక ఆదాయం ఆధారంగా మూడు వర్గాలుగా విభజించారు:
- EWS (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు): వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉండాలి.
- LIG (తక్కువ ఆదాయ వర్గాలు): వార్షిక ఆదాయం రూ. 6 లక్షల వరకు ఉండాలి.
- MIG (మధ్య ఆదాయ వర్గాలు): వార్షిక ఆదాయం రూ. 9 లక్షల వరకు ఉండాలి.
ఆర్థిక సాయం వివరాలు
ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం మొత్తం రూ. 2.5 లక్షల వరకు సహాయం అందిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష వరకు ఇస్తాయి. అంతేకాకుండా హోమ్ లోన్ తీసుకునే వారికి రూ. 1.8 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది.
నిబంధనల్లో వచ్చిన భారీ మార్పులివే!
ప్రభుత్వం ఈసారి రూల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది..
- స్థలం రిజిస్ట్రేషన్ తేదీ: ఆగస్టు 31, 2024 కంటే ముందే సొంత స్థలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆ తేదీ తర్వాత స్థలం కొన్నవారు లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఈ నిధులకు అర్హులు కారు.
- నివాస ప్రాంతం: మీ స్థలం ఖచ్చితంగా నివాస ప్రాంతం (Residential Area) లోనే ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉన్న స్థలాలకు ఈ పథకం వర్తించదు.
- అర్హత సర్టిఫికేట్: నిధులు పొందేందుకు 'ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ సర్టిఫికేట్' తప్పనిసరి. అధికారిక పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మున్సిపల్ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే సర్టిఫికేట్ ఇచ్చి, నాలుగు విడతల్లో డబ్బులు జమ చేస్తారు.
ఏయే డాక్యుమెంట్లు అవసరం?
మీరు ఆగస్టు 31, 2024 కంటే ముందే అక్కడ నివసిస్తున్నారని నిరూపించేందుకు పాత కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు లేదా మున్సిపల్ ట్యాక్స్ రసీదులు చూపించాలి. పాత ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నా అది ఆధారంగా పనిచేస్తుంది. ప్రభుత్వం జియో-ట్యాగింగ్, శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా కూడా మీ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది.
ఏదేమైనా అర్హత కలిగిన వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మురికివాడల్లో ఉండేవారు, వీధి వ్యాపారులు, పని చేసే మహిళలకు ఈ పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) పథకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అవకాశాన్ని వృథా చేయకుండా అప్లై చేయండి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications