హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ అక్రమాస్తుల చిట్టా ఇదిగో.. కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సంపాదన..

తెలంగాణలో మరో అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంపై ఏసీబీ దాడులు చేయగా కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి సంపాదన బయటపడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) చీఫ్ ఇంజనీర్ బి. రవీందర్ ఇల్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) అధికారులు మంగళవారం జరిపిన ఆకస్మిక సోదాల్లో దాదాపు రూ. 50 కోట్ల వరకు అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం.

ఏసీబీ తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడటంతో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. రవీందర్‌పై.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడుల పరిధిలో నానక్‌రామ్‌గూడలోని సుమధుర అక్రోపోలిస్ కండోమినియంలో ఉన్న రవీందర్ నివాసంతో పాటు ఆయన కార్యాలయం, బంధువులు, సహచరులు, బినామీలుగా అనుమానిస్తున్న వారికి చెందిన మొత్తం 11 ప్రదేశాలలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

HMDA HMDA Chief Engineer ACB Raid ACB Telangana Disproportionate Assets 50 Crore Assets Corruption Case Hyderabad News Telangana News Gold Luxury Cars Plots Flats Breaking News HMDA HMDA ACB ACB 50

రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఈ స్థిరాస్తుల ప్రభుత్వ విలువ సుమారు 9.24 కోట్ల రూపాయలుగా తేలినప్పటికీ.. హైదరాబాద్ పశ్చిమ కారిడార్‌లో రియల్ ఎస్టేట్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల వీటి అసలు మార్కెట్ విలువ దాదాపు 50 కోట్ల నుండి 100 కోట్ల రూపాయల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల వివరాల్లో రంగారెడ్డి జిల్లాలోని కొండకల్, కిస్తాపూర్, పసమైలాలలో ఉన్న ఐదు ఖాళీ ప్లాట్లతో పాటు నర్సింగి, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో నాలుగు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయి. వీటితో పాటు శంషాబాద్ సమీపంలోని కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి.. మోకిలలోని శ్రీవారి మెడోస్ గేటెడ్ కమ్యూనిటీలో 300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఒక సెమీ-ఫినిష్డ్ విల్లా, కొండాపూర్‌లోని మసీద్ బండా వద్ద 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన ఒక జీ+4 అంతస్థుల వాణిజ్య నివాస భవనం వెలుగులోకి వచ్చాయి.

Also Read

స్థిరాస్తులతో పాటు భారీ మొత్తంలో చరాస్తులను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఇందులో సుమారు 3.82 లక్షల రూపాయల ప్రత్యక్ష నగదు.. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 45.05 లక్షల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 36.7 లక్షల రూపాయల విలువైన 1.44 కేజీల బంగారు ఆభరణాలు.. 10 లక్షల రూపాయల విలువైన 12.5 కేజీల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కోటి 16 లక్షల రూపాయల విలువైన ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ వంటి నాలుగు విలాసవంతమైన వాహనాలు.. 17.24 లక్షల రూపాయల విలువైన గృహోపకరణాలు, 9.32 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా దొరికాయి.

నిజామాబాద్ జిల్లాకు చెందిన 60 ఏళ్ల రవీందర్.. 1985 మే 20న అప్పటి హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (HUDA)లో సహాయ ఇంజనీర్‌గా తన ప్రభుత్వ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ 2008లో కొత్తగా ఏర్పడిన హెచ్‌ఎండిఏలో విలీనం కావడంతో ఆయన సేవలు అక్కడ కొనసాగాయి. కాలక్రమేణా పదోన్నతులు పొందుతూ చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరిన ఆయన.. ఈ వ్యవధిలోనే అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఈ వ్యవహారంలో ఆయనకు సహకరించిన బినామీల వివరాలను.. ఇతర అనుమానాస్పద లావాదేవీలను వెలికితీసేందుకు ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+