కేంద్రం ఈ స్కీంతో రూ.40 లక్షల కోట్ల అదనపు ఆదాయం

దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్(PLI) స్కీమ్‌ను ప్రకటిస్తోంది. దీని వల్ల ఆదాయం రూ.35 లక్షల కోట్ల నుండి రూ.40 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా కారణంగా గత ఏడాది చైనాను వీడిని పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో కేంద్రం ప్రత్యేక PLI స్కీంతో ముందుకు వచ్చింది.

పలు రంగాల్లో దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. PLI కారణంగా వచ్చే రెండు సంవత్సరాల నుండి రెండున్నరేళ్ల కాలంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. మూలధన వ్యయం కొత్తగా దాదాపు రెండు లక్షల నుండి 2.7 లక్షల కోట్లు పెరగనున్నట్లు అంచనా. ఐటీ హార్డ్ వేర్, టెలికాం పరికరాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు వంటి రంగాల్లో దేశీయ తయారీ బలహీనంగా ఉందని వెల్లడించింది.

PLI scheme can generate ₹35 to 40 trillion incremental revenue in 5 years

తాజాగా ప్రకటించిన PLIతో ఈ రంగాల్లో మూలధన వ్యయం దాదాపు 3.5 శాతం పుంజుకుంటుందని వెల్లడించింది. అలాగే 2022లో పారిశ్రామిక పెట్టుబడుల్లో మూలధన వ్యయం వాటా 45 శాతం నుండి 50 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. బ్యాంకు రుణాలకు డిమాండ్ పెరగనుందని పేర్కొంది. ఇవి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని అభిప్రాయపడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+