ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏడు విమానాశ్రయాలకు అదనంగా మరో ఏడు విమానాశ్రయాలను అభివృద్ధి చేయడంతో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే భవిష్యత్తులో విమానాశ్రయాల్లో ప్రైవేట్ విమానాల పార్కింగ్కు డిమాండ్ ఉందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నిన్న శుక్రవారం ఉండవల్లిలో నివాసంలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో పాటు ప్రస్తుతమున్న విమానాశ్రయాల విస్తరణపై సమీక్షించారు.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గన్నవరం, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలను నిర్వహిస్తుండగా, కర్నూలు విమానాశ్రయ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. అలాగే పుట్టపర్తి ఒక ప్రైవేట్ ఎయిర్స్ట్రిప్ గా మాత్రమే ఉండనుంది. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయం సిద్ధమవుతున్నప్పటికీ, పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు ప్రారంభించింది.

కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం మధ్య అలాగే ఒంగోలులో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పం విమానాశ్రయం కోసం ఇప్పటికే సిద్ధం చేసిన నివేదిక ప్రకారం దీనిని రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాల్లో, రెండో దశలో 567 ఎకరాల్లో మొత్తంగా 1,250 ఎకరాల్లో నిర్మాణం చేపట్టనున్నారు. ఐఏఎఫ్, హెచ్ఏఎల్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రస్తుతం ప్రతిపాదించిన కుప్పం విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నందున అన్ని సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందడంతో పాటు ఎయిర్ స్పెస్ సమస్యను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు.
శ్రీకాకుళం విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే అవసరమైన సర్వే పూర్తయిందని 1,383 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో నిర్మించనున్నామని ఇంకా భూసేకరణ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. దగదర్తి విమానాశ్రయం కోసం గత టీడీపీ హయాంలో ఇప్పటికే 635 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, ఇప్పుడు మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉందని అందుకు కావాల్సిన అన్ని అనుమతులు లభించాయన్నారు. ఈ ప్రాంతంలో బిపిసిఎల్ రిఫైనరీ రానున్నందున ఈ విమానాశ్రయం పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

శ్రీసిటీ సెజ్లో ఎయిర్స్ట్రిప్ నిర్మాణానికి అవకాశాలను రీసర్చ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఒంగోలు విమానాశ్రయానికి 657 ఎకరాల భూమిని గుర్తించగా, ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన నివేదిక ఇంకా సిద్ధం కాలేదు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్కు సమీపంలో 1,670 ఎకరాల్లో మరో విమానాశ్రయాన్ని ప్రతిపాదించగా, అటవీ అనుమతులు అవసరమైనందున 500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
తాడేపల్లిగూడెం విమానాశ్రయం కోసం 1,123 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దానికి రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలు అతి సమీపంలో ఉండడంతో పరిశీలిస్తున్నారు. అలాగే తుని-అన్నవరం మధ్య కూడా విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. నక్కపల్లిలో ఉక్కు కర్మాగారంతో పాటు అనేక పరిశ్రమలు వస్తున్నందున ఈ ప్రాంతంలో విమానాశ్రయం అవసరం ఉందన్నారు. తాడిపత్రి సమీపంలో విమానాశ్రయం అవసరమని కూడా చంద్రబాబు నాయుడు భావించారు అలాగే ప్రతిపాదనను కూడా పరిశీలించాలని అధికారులను కోరారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications