India Post SMS Scam: దేశంలోని కోట్లాది మంది గ్రామీణ, పట్టణ ప్రజలు ఎన్ని బ్యాంకింగ్ సంస్థలు వచ్చినా ఇప్పటికీ వారు నమ్మేది పోస్టల్ స్వీసులనే. వారు తమ గ్రామాల్లోనే వీటిలో డబ్బును పొదుపుచేసుకోవటం నుంచి ఇన్సూరెన్స్ వంటి సేవల వరకు వీటి నుంచి పొందుతున్నారు. అయితే ఈ సారి స్కామర్లు పోస్టల్ వినియోగదారులను టార్గెట్ చేయటంతో చాలా మంది నష్టపోతున్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
మోసగాళ్లు ఇప్పటికే దేశంలో అనేక కొత్త పద్ధతులను వినియోగించి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా వీరు ఇండియా పోస్ట్ పేరును పెద్ద స్థాయిలో మోసాలకు వినియోగించటం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్తరకం మోసంలో ముందుగా ఇండియా పోస్ట్ పేరుతో మోసగాళ్లు ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు. వారు ఆ మెసేజ్లో ఒక వెబ్ లింక్ పంపుతారు. మీకు పార్శిల్ డెలివరీ కోసం 48 గంటల్లో చిరునామాను ఇవ్వాలని మోసగాళ్లు సదరు మెసేజ్ ద్వారా అడుగుతున్నారు.

ఇండియా పోస్ట్ పేరుతో ప్రజలకు వస్తున్న ఈ ఫేక్ మెసేజ్ పై ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ ద్వారా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఒక పోస్ట్ షేర్ చేసింది. నేరగాళ్లు పంపిస్తున్న ఫేక్ మెసేజ్లోని లింక్పై క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని వారు కోరుతున్నారు.
చిరునామాను అప్డేట్ చేయాలంటూ ఇండియా పోస్ట్ పేరుతో సైబర్ మోసగాళ్లు పంపిన లింక్ పై క్లిక్ చేయటం ద్వారా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు పంపిన లింక్ ద్వారా వ్యక్తుల ఫోన్లలోకి మాల్వేర్ చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ ప్రైవేట్ డేటా చోరీకి గురై ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఉండేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తాజాగా రావటం ప్రజలను అప్రమత్తంగా చేస్తోంది. ఇండియా పోస్ట్ ఇలాంటి సందేశాలను కస్టమర్లకు పంపదని పీఐబీ వెల్లడించింది. ఎవరైనా ఇలాంటి మెసేజ్ లను అందుకుంటే అందులోని లింక్స్ పై క్లిక్ చేయవద్దని, ఆ సందేశాలను డిలీట్ చేయాలని PIB కోరింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications