దీపావళి లోపు PF సబ్స్క్రైబర్లకు గుడ్న్యూస్, ఆ మొత్తం జమ
పండుగ సమయంలో ఉద్యోగులకు శుభవార్త! 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అందించే వడ్డీని ఈ దీపావళికి ముందే వారి ఖాతాలలో జమ చేసేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) సమాయత్తమవుతోంది. దీంతో ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ప్రయోజనం కలగనుంది.
PF సబ్స్క్రైబర్లకు 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 8.5శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కార్మిక శాఖ సమ్మతించింది. దీంతో 8.5 శాతం వడ్డీ మొత్తాన్ని సబ్స్క్రైబర్లకు త్వరలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీపావళి కన్నా ముందే సబ్స్క్రైబర్లకు ఖాతాల్లో వీటిని జమయ్యే అవకాశాలు ఉన్నట్లు EPFO తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనుకున్న 8.5 శాతం వడ్డీ రేటు గత ఏడేళ్లలో కనిష్ఠం. 2018లో 8.55 శాతం వడ్డీ ఇవ్వగా, 2019లో 8.35 శాతం అందించింది. కరోనా నేపథ్యంలో ఉపసంహరణలు పెరగడం, జమయ్యే నిధులు తగ్గిపోవడంతో ఈసారి తక్కువ వడ్డీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వడ్డీ రేటు తమ PF ఖాతాల్లో జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి పలు మార్గాలున్నాయి. వడ్డీకి జమ చేసిన విషయాన్ని EPFO సబ్స్క్రైబర్ల ఫోన్కు సందేశం పంపిస్తుంది. సబ్స్క్రైబర్ స్వయంగా తెలుసుకోవాలనుకుంటే మెసేజ్ పంపించడం ద్వారా తెలుసుకోవచ్చు. PF రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 'EPFOHO UAN ENG' అని టైప్ చేసి 7738299899 మొబైల్ నెంబర్కు సందేశం పంపించాలి. లేదా 011-22901406 నెంబర్కు మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFO వెబ్సైట్, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.