పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం (మే 31) ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ముంబై, భోపాల్ సహా పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.47, డీజిల్ రూ.92.45గా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పెట్రోల్ రూ.102.45, డీజిల్ రూ.93.37గా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.94.23, డీజిల్ రూ.85.15గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 29 పైసలు, డీజిల్ పైన 26 పైసలు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ రూ.94.25, డీజిల్ రూ.87.74కు చేరుకుంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.97.93, డీజిల్ రూ.92.83గా ఉంది.

ఈ నెలలో రూ.4కు పైగా పెంపు
మే నెలలో ఇంధన ధరలు మండిపోయాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా పెంపుతో వినియోగదారులకు షాకిచ్చాయి. పలుచోట్ల పెట్రోల్ ధర ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ నెలలో చమురు సంస్థలు 16సార్లు ఇంధన ధరలను పెంచాయి. మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.4 వరకు పెరిగాయి. మే 3వ తేదీ తర్వాత నుండి దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. సోమవారం కూడా చమురు సంస్థలు పెట్రోల్ ధర 28 నుండి 29పైసలు, డీజిల్ ధరను 26 నుండి 28 పైసలు పెంచాయి.
మొత్తంగా ఈ నెలలో లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.83, డీజిల్ పైనరూ.4.42 పెరిగింది. వ్యాట్, స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.

2019 జనవరి నుండి ధరలు ఇలా
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. 2019 జనవరి నెలలో పెట్రోల్ ధర లీటర్ రూ.68.65గా ఉంది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు బ్యారెల్కు 59.27గా ఉంది. గత ఏడాది కరోనా సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 20 డాలర్ల స్థాయికి పడిపోయాయి.
కానీ దేశీయంగా పన్నులు పెంచడంతో ఇక్కడ ధరలు తగ్గలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 2019 జనవరి స్థాయికి చేరుకున్నాయి. కరోనా సమయంలో పన్నులు పెంచడంతో దేశీయంగా అప్పుడు ఉన్న ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 2019 జనవరిలో బ్యారెల్ ఇంధనం 59.27 డాలర్లు కాగా, ప్రస్తుతం 67.05 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో అప్పుడు పెట్రోల్ లీటర్ రూ.68.55 కాగా, ఇప్పుడు రూ.93కు పైన ఉంది.

ప్రభుత్వ పన్నులే అధికం
ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. ఉదాహరణకు ఢిల్లీలో చూసుకుంటే మే 16న లీటర్ పెట్రోల్ రూ.92.88గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూసుకుంటే లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.34.19. రవాణా తదితర ఖర్చులు 0.36 పైసలు. డీలర్స్కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.34.55. ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90.
డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.3.77. వ్యాట్ రూ.21.36. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ మే 16వ తేదీన రూ.83.22గా ఉంది. ట్యాక్స్ బ్రేక్ చూస్తే బేస్ ప్రైస్ రూ.36.32. రవాణా తదితర ఖర్చులు 0.33 పైసలు. డీలర్స్కు వేసే ఛార్జ్ (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహా) రూ.36.65. ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80. డీలర్ కమిషనర్ (యావరేజ్) రూ.2.58. వ్యాట్ రూ.12.19.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications