Petrol price today: ఏడో రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడో రోజు స్థిరంగా ఉన్నాయి. గత ఆదివారం నుండి ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నేడు (శనివారం, జూలై 24) స్థిరంగా ఉన్నాయి. గత శనివారం ధరలు పెరిగాయి. ఆ తర్వాత యథాతథంగా ఉన్నాయి. చివరిసారి అంటే గత శనివారం లీటర్ పెట్రోల్ పైన నిన్న 30 పైసలు పెరిగింది. ఈ నెలలో ఈ ఇరవై నాలుగు రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల విషయానికి వస్తే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 71.85 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 73.76 డాల్ల వద్ద ఉంది.
గత శనివారం పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గతవారం పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45గా ఉంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.76గా ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.