పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్, పెరుగుతున్న EV అమ్మకాలు
ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత 19 రోజులుగ ధరలు పెరగనప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పలుప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. మెట్రో నగరాల్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అన్ని నగరాల్లోను పెట్రోల్ రూ.90 క్రాస్ చేయగా, డీజిల్ ధరలు చాలాచోట్ల రూ.80 దాటాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటం, దేశీయంగా సెస్ ప్రభావం సామాన్య వినియోగదారుడిపై భారం పడుతోంది.
దీంతో చాలామంది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు వాహన కొనుగోలుదారులు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ను ఎంచుకుంటున్నారు.

ఈవీ కొనుగోళ్లకు ఆసక్తి
గత కొంతకాలంగా పర్యావరణహితం కోసం గ్రీన్ వెహికిల్స్ను ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రికల్ వెహికిల్స్ అందరికీ చేరుకోనప్పటికీ గతేడాదికి ముందే కొనుగోలుదారులు వీటి వైపు చూడటం ప్రారంభించారు. దీనికి తోడు ప్రభుత్వం ఎన్నో ఊరట ప్రకటనలు చేసింది. పైగా గత కొంతకాలంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో కొత్త కొనుగోలుదారులు ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఒక యూనిట్తో...
ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎలక్ట్రికల్ టూ-వీలర్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ వెహికిల్ సేల్స్ భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరగడంతో డబ్బులు ఆదా దిశగా చూస్తున్నారు. ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలు చేస్తే ఒక యూనిట్ ఖర్చుతో పదుల కిలోమీటర్లు వెళ్తుంది.

కొనుగోలు ఖర్చు మాత్రమే
ఎలక్ట్రికల్ గూడ్స్ వెహికిల్ రూ.1 లక్ష నుండి ఉన్నాయి. ఇటీవల కాస్త ధరలు పెరిగాయి. దీంతో చిన్న చిన్న వ్యాపారులు కూడా వీటిని కొనుగోలు చేసి, వస్తువులు కొనుగోలు చేసి, రవాణాకు ఉపయోగిస్తున్నారు. వ్యాపారులు అద్దె గూడ్స్ వెహికిల్స్లలో వస్తువులు తెచ్చుకునేవారు. ఇప్పుడు చాలామంది సొంతగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కొనుగోలు ఖర్చు మాత్రమే ఉండి, ఆ తర్వాత రవాణా ఖర్చు పెద్దగా లేకపోవడమే కారణంగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications


