హైదరాబాద్లో సెంచరీ దాటిన పెట్రోల్, ముంబైలో రూ.103 క్రాస్: డీజిల్ అక్కడ రూ.100 పైనే
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు లీటర్కు రూ.100 పైకి చేరుకున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.103 క్రాస్ చేసింది. బెంగళూరు నగరంలో పెట్రోల్ రూ.100 దాటగా, హైదరాబాద్లో సెంచరీ దాటి రూ.100.74గా ఉంది. దాదాపు ఏడు రాష్ట్రాల్లో రూ.100కు పైన ఉంది. గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వాహన వినియోగదారులకు షాకిస్తున్నాయి. నేడు (శుక్రవారం 18, 2021) కూడా పెరిగాయి. ఈ జూన్ నెలలో పదోసారి పెరిగింది. తద్వారా ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటుంది.
క్రెడిట్ స్కోర్ లేకుంటే.. రుణానికి విద్యార్హత, జాబ్ ప్రొఫైల్ అవసరం
హైదరాబాద్ సహా రూ.100
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతాయి. నేటి పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.93, లీటర్ డీజిల్ రూ.87.69గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.103.08కి చేరుకుంది. డీజిల్ ధర రూ.95.14గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.98.14, డీజిల్ రూ.92.31, కోల్కతాలో పెట్రోల్ రూ.96.84, డీజిల్ రూ.90.54, భోపాల్లో పెట్రోల్ రూ.105.13, డీజిల్ రూ.96.35, బెంగళూరులో పెట్రోల్ రూ.100.17, డీజిల్ రూ.92.97గా ఉంది. పెట్రోల్ రూ.100 దాటిన మొదటి రాజధాని భోపాల్. ఆ తర్వాత ముంబైలోను క్రాస్ చేసింది. హైదరాబాద్లో 100ను దాటింది.
ఏడు రాష్ట్రాల్లో రూ.100 క్రాస్
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ రూ.108.07గా ఉండగా, డీజిల్ కూడా సెంచరీని దాటింది. డీజిల్ రూ.100.82గా ఉంది. ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, లడక్లలో పెట్రోల్ రూ.100 దాటింది.
క్రూడ్ ధరలు...
ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ 72.56 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ 70.56 డాలర్లుగా ఉంది. దేశీయ చమురురంగ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. ఆయా రాష్ట్రాల పన్నులను బట్టి వివిధ చోట్ల ధరలు వేర్వేరుగా ఉంటాయి. దేశీయ చమురు రంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ధరలను ప్రతిరోజు సవరిస్తాయి.