Petrol, diesel prices: 12వ రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు యథాతథంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం నేడు (ఏప్రిల్ 27, సోమవారం) న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.40, లీటర్ డీజిల్ ధర రూ.80.73గా ఉంది. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తక్కువగా ఉంది. సెస్తో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాట్ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.83, లీటర్ డీజిల్ రూ.87.81, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.43, లీటర్ డీజిల్ రూ.85.75, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.62, లీటర్ డీజిల్ రూ.83.61గా ఉంది. ప్రభుత్వ చమురురంగ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం నేడు పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా ఉంచాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలను బట్టి దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు ఏప్రిల్ 15వ తేదీన స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ పైన 16 పైసలు, డీజిల్ పైన 14 పైసలు తగ్గించాయి చమురు రంగ మార్కెట్ కంపెనీలు. అంతకుముందు పదిహేను రోజుల పాటు ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్చి 24, 25 తేదీల్లోను ధరలు స్వల్పంగా తగ్గాయి.


Click it and Unblock the Notifications