దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 క్రాస్ చేశాయి. రాజస్థాన్లోని గంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర బుధవారం రూ.107.79, లీటర్ డీజిల్ ధర రూ.100.51గా ఉంది. గత 44 రోజుల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు 25సార్లు పెరిగాయి. దేశీయ చమురురంగ కంపెనీలు ఇంధన ధరలను నేడు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, లీటర్ డీజిల్ పైన 13 పైసలు పెరిగింది.
తాజా పెరుగుదలతో ఈ 44 రోజుల కాలంలో... అంటే మే 4వ తేదీ నుండి పెట్రోల్ ధర లీటర్ పైన రూ.6.26, డీజిల్ లీటర్ పైన రూ.6.68 పెరిగింది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.66, లీటర్ డీజిల్ రూ.87.41కి పెరిగింది. బెంగళూరులో కూడా పెట్రోల్ రూ.100కు సమీపంలో ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.102.82, లీటర్ డీజిల్ రూ.94.84గా ఉంది.

ముంబై, రత్నగిరి, పర్బానీ, ఔరంగాబాద్, జైసల్మేర్, గంగానగర్, బాన్స్వాడా, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, గుంటూరు, కాకినాడ, చిక్మగ్లూరు, శివమొగ్గ, హైదరాబాద్, లెహ్ ప్రాంతాల్లో పెట్రోల్ రూ.100 క్రాస్ చేసింది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications