దేశంలో వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గురువారం (జూన్ 18వ తేదీ) లీటర్ పెట్రోల్ పైన 53 పైసలు, లీటర్ డీజిల్ పైన 64 పైసలు పెరిగింది. ఈ రోజు పెరుగుదలతో ఈ పన్నెండు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.6.55, లీటర్ డీజిల్ ధర రూ.7.04 పెరిగింది. కరోనా - లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.

పెంపుతో ఎంత ఆదాయం వస్తుందంటే
తాజా పెంపుతో ఢిల్లీలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.81, డీజిల్ రూ.76.43కు చేరుకుంది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగాకలవడంతో ధరల్లో రాష్ట్రాన్ని బట్టి స్వల్ప తేడా ఉంటుంది. ప్రభుత్వం మార్చిలో పెట్రోల్, డీజిల్ పైన రూ.3 ఎక్సైజ్ డ్యూటీ, మే నెలలో లీటర్ పెట్రోల్ పైన రూ.10, లీటర్ డీజిల్ పైన రూ.13 పెంచింది. దీంతో ధరలు పెరిగి, కేంద్రానికి అదనంగా రూ.2 లక్షల కోట్ల నుండి రూ.2.50 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. మరికొన్ని సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.4 లక్షల కోట్ల నుండి రూ.1.75 లక్షల కోట్ల వరకు మాత్రమే అదనంగా వస్తుందని చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత ధర అంటే
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.84.66, డీజిల్ రూ.75, జైపూర్లో పెట్రోల్ రూ.84.79, డీజిల్ రూ.77, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాట్నాలలో పెట్రోల్ రూ.80కి పైకి చేరుకుంది. కోల్కతా, నోయిడాలో రూ.80 మార్క్ చేరుకుంది. డీజిల్ హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.77, డీజిల్ రూ.74.70కి చేరుకుంది. అమరావతిలో పెట్రోల్ రూ.81.19, డీజిల్ రూ.75.14కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ రూ.80.80, డీజిల్ రూ.74.77కు చేరుకుంది. జైపూర్లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ రూ.84.79 ఉంది.

పెరుగుతున్న ఇంధన డిమాండ్
మార్చి చివరి వారం నుండి లాక్ డౌన్ కారణంగా ఇంధన ఉత్పత్తి పడిపోయింది. దీంతో ఏప్రిల్ నెలలో 4.22 మిలియన్ మెట్రిక్ టన్నులు (MMT) పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఉండగా, మార్చి నెలలో ఇది 7.8 MMTగా ఉంది. మే నెల నాటికి క్రమంగా పెరిగింది. ఇది 7.26MMTకు చేరుకుంది. అసలు రూ.1.55 లక్షల కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా ఎక్సైజ్ సుంకం పెంచారని చెబుతున్నారు. సాధారణంగా పెట్రోల్ పైన రూ.1 పెంచితే రూ.14,000 కోట్లు రెవెన్యూ అదనంగా వస్తుంది. ఇప్పడు దీంతో రూ.1.75 లక్షల కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లకు పైగా వరకు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications