For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

|

పెట్రోల్, డీజిల్ ధరలు 18 రోజుల తర్వాత మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మే 4, 2021 మంగళవారం రోజున దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.15 పైసలు పెరిగి రూ.90.40 నుండి రూ.90.55కు, లీటర్ డీజిల్ 18 పైసలు పెరిగి రూ.80.73 నుండి రూ.80.91కు పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.96.95, డీజిల్ రూ.87.98, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.92.55, లీటర్ డీజిల్ రూ.85.90, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.90.76, లీటర్ డీజిల్ రూ.83.78గా ఉంది.

ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన ధరల్లో పెరుగుదల నమోదయింది. చివరిసారి గత నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పద్దెనిమిది రోజుల విరామం తర్వాత రేట్లను సమీక్షించాయి భారత చమురురంగ కంపెనీలు. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు ధరలు పెరగడం గమనార్హం.

Petrol, Diesel Prices Hiked After 18 Days

పెట్రోల్, డీజిల్ ధరలు 66 రోజుల తర్వాత పెరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన పెరిగాయి. ఈ మధ్యకాలంలో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరలు తగ్గలేదనే అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల ముందు అయిదు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఇంధన ధరలను తగ్గించాయి చమురు సంస్థలు.

English summary

18 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | Petrol, Diesel Prices Hiked After 18 Days

Petrol and diesel prices have been hiked up to 18 paise across the metros on Tuesday, May 4, 2021 after a pause of 18 days. In Delhi, petrol prices have been increased by 15 paise from ₹ 90.40 per litre to ₹ 90.55 per litre and diesel prices have been raised by 18 paise from ₹ 80.73 per litre to ₹ 80.91 per litre, according to the Indian Oil Corporation.
Story first published: Tuesday, May 4, 2021, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X