పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజు పెరిగాయి. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు మనవద్ద పెట్రోల్, డీజిల్ ధరలు వాహన వినియోగదారులకు షాకిస్తున్నాయి. జూన్ 7, ఆదివారం నుండి చమురు మార్కెట్ సంస్థలు ధరలను సమీక్షిస్తున్నాయి. వరుసగా ప్రతిరోజు పెరిగి, నేటి పెంపుతో ఏడాది కంటే అత్యధిక ధరలను తాకాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్ పైన 46 పైసలు, లీటర్ డీజిల్ పైన 59 పైసలు పెరిగింది.

ఏ నగరంలో ఎంత ధర?
పెట్రోల్, డీజిల్ పైన వరుసగా 46 పైసలు, 59 పైసలు పెరగడంతో మెట్రో నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- న్యూఢిల్లీ: పెట్రోల్ రూ.76.26, డీజిల్ రూ.74.62
- గుర్గావ్: పెట్రోల్ రూ.75.05, డీజిల్ రూ.67.45
- ముంబై: పెట్రోల్ రూ.83.17, డీజిల్ రూ.73.21
- చెన్నై: పెట్రోల్ రూ.79.96, డీజిల్ రూ.72.69
- హైదరాబాద్: పెట్రోల్ రూ.79.17, డీజిల్ రూ.72.93
- బెంగళూరు : పెట్రోల్ రూ.78.73, డీజిల్ రూ.70.95

9 రోజుల్లో పెరుగుదల
ఈ తొమ్మిది రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.4.98 పెరిగింది. అంటే రూ.5 పెరిగినట్లే. లీటర్ డీజిల్ పైన రూ.5.23 పెరిగింది. డీజిల్ పైన రూ.5 కంటే ఎక్కువే పెరిగింది. ప్రభుత్వం గత నెలలో పెట్రోల్ పైన రూ.10, డీజిల్ పైన రూ.13 ఎక్సైజ్ డ్యూటీని పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు అక్టోబర్ - నవంబర్ 2018 మధ్య కనిపించాయి. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు 82 రోజుల తర్వాత చమురు కంపెనీలు ధరలను సమీక్షించడం ప్రారంభించాయి.

ధరలు ఎందుకు పెంచుతున్నాయి
అంతర్జాతీయ మార్కెట్ ధరలు ఎలా ఉన్నప్పటికీ రిఫైనరీ, కార్యకలాపాలు సహా వివిధ ఖర్చుల కారణంగా చమురు రంగ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో వేతనాలు సహా వివిధ ఖర్చుల కారణంగా భారీగా నష్టపోయాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కొద్ది రోజుల పాటు పెంపు ఉంటుందని భావిస్తున్నారు. రిటైల్ ఇంధన ధరల్లో ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్, సెస్ వంటివే 70 శాతంగా ఉన్నాయి. అందుకే పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని అధికార బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సుముఖంగా లేవు.

రూ.50 కంటే దిగువకు పెట్రోల్ ధరలు
నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని సుంకాలను వెనక్కి తీసుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.50 కంటే కిందకు వస్తాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. కాగా, కరోనా భయాల కారణంగా సోమవారం చమురు ధరలు 2 శాతం పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 66 సెంట్లు లేదా 1.7 శాతం నష్టపోయి బ్యారెల్కు 38.07 డాలర్లు, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 81 సెంట్లు లేదా 2.2 శాతం పడిపోయి బ్యారెల్ 65.45 డాలర్లు పలికింది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications