Telangana: కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాళ్లు.. హామీల అమలులో ఇబ్బందులు తప్పవా..?

Telangana Budget 2025: తెలంగాణ ప్రజలు 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దాని విజన్‌ను నూతన ఆర్థిక చర్యల రూపంలో అమలు చేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేసిన ప్రసంగం ఈ బడ్జెట్‌ను దిశానిర్దేశం చేయనుంది.

మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం విస్తృతమైన సుదీర్ఘ సవరణలను చూపించే ప్రణాళికలు ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆదాయాలు మందగించటం, అప్పుల పెరుగుదల నేపథ్యంలో ఈ విధానాలు వాస్తవికంగా ఎంతవరకు నిధుల కేటాయింపులతో అమలు చేయగదనే సవాళ్లు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లూ భట్టి విక్రమార్క 2025 మార్చి 19న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ 3.15 లక్షల కోట్ల నుంచి 3.2 లక్షల కోట్ల వరకు ఉండాలని అంచనా వేయబడుతోంది.

అయితే మొత్తం బడ్జెట్ ఖర్చులు సుమారు 2.2 లక్షల కోట్ల నుంచి 2.3 లక్షల కోట్ల మధ్య ఉంటాయని, ఈ అంచనాలకు అనుగుణంగా ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవడంతో బడ్జెట్లో భారీ లోటు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆలస్యాన్ని అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టమవుతోందని అన్నారు. ఈ ప్రకటన తెలంగాణ ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణంగా ఆరోపిస్తున్నారు.

revanth reddy

తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాది ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించింది కానీ అమలు చేయడంలో విఫలమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణం, రైతు భరోసా, పంట రుణ మాఫీలు, ఎల్‌పీజీ సబ్సిడీలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు స్టార్ట్ చేయబడ్డాయి. అయితే ఇప్పటికీ కొన్ని హామీలు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.

ఈసారి ఇందిరమ్మ హౌసింగ్, మహిళలకు సారెల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు వంటి స్కీమ్స్ తాజా బడ్జెట్‌లో సరికొత్త కేటాయింపులతో ఉంటాయని ప్రజలు ఆసక్తింగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యుత్, పంచాయతీ రాజ్ వంటి రంగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వొచ్చని తెలుస్తోంది. అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ కు భారీగా కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. రాష్ట్రం ఇప్పటికే ASHA, అంగన్‌వాడీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో కష్టపడుతున్న నేపధ్యంలో ఆర్థిక స్థిరత్వంపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.

బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్, రీజినల్ రింగ్ రోడ్, రైల్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వంటి కీలక మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించబడతాయని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్రం నుంచి సహాయం పొందడంపై తెలంగాణ ప్రభుత్వం విశ్వసిస్తుంది. గత 5-6 సంవత్సరాల్లో కేంద్ర గ్రాంట్లు రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు 25% మాత్రం కంటే మించలేదు. బడ్జెట్ సమర్పణలో కేంద్ర గ్రాంట్ల పెరుగుదలపై మరింత క్లారిటీ ఉండే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+