దేశంలో ఆన్ లైన లావాదేవీలు వేగంగా పెరుగుతోన్నాయి. దీనితో పాటు సైబర్ మోసాల కేసులు కూడా భారీగా పెరుగుతోన్నాయి. దీంతో భారతీయులు వేల కోట్ల రూపాయల నష్టపోతున్నారు. ఈ ఏడాది మొదటి 4 నెలల్లోనే దేశంలో 7 లక్షలకు పైగా సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వివరాల ప్రకారం ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే సైబర్ మోసం కారణంగా భారతీయులు వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు.
జనవరి 2024 నుంచి ఏప్రిల్ వరకు ఉన్న డేటా ప్రకారం వివిధ సైబర్ మోసాల కేసుల కారణంగా భారతీయ ప్రజలు రూ. 1,750 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ కాలంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో 7 లక్షల 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం, మే నెలలో ప్రతిరోజూ సగటున 7 వేల సైబర్ నేరాల ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో 85 శాతం ఫిర్యాదులు ఆన్లైన్ ఆర్థిక మోసాలకు సంబంధించినవే ఉన్నాయి.

సైబర్ క్రైమ్ల వార్షిక గణాంకాలను పరిశీలిస్తే గత 5 సంవత్సరాలలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరుగుతోన్నాయి. 2019లో కేవలం 26 వేల 49 సైబర్ నేరాలు మాత్రమే నమోదయ్యాయి. 2020లో ఈ సంఖ్య 2 లక్షల 57 వేల 777కి పెరిగింది. ఆ తర్వాత సైబర్ నేరాల కేసులు 2021లో 4 లక్షల 52 వేల 414కి, 2022లో 9 లక్షల 66 వేల 790కి పెరిగాయి. గతేడాది సైబర్ క్రైమ్ కేసులు 15 లక్షలు దాటాయి. మొత్తం సంఖ్య 15 లక్షల 56 వేల 218కి చేరింది. ఇక ఈ ఏడాది కేవలం 4 నెలల్లోనే 7 లక్షల 40 వేల 957 కేసులు నమోదయ్యాయి.
ముఖ్యంగా ట్రేడింగ్ స్కామ్లలో ప్రజలు గరిష్టంగా రూ.1,420 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 20,043 వ్యాపార మోసాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో 4,599 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో ప్రజలు రూ.120 కోట్ల నష్టాన్ని చవిచూశారు. పెట్టుబడి మోసాల కారణంగా రూ.222 కోట్లు, డేటింగ్ యాప్ల కారణంగా రూ.13.23 కోట్లు ప్రజలు నష్టపోయారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications