Paytm Shares: కుప్పకూలిన పేటీఎం స్టాక్.. విజయశేఖర్ శర్మకు కొత్త తలనొప్పి, రంగంలోకి ఈడీ..!

Paytm Stock Fall: భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పెద్ద మార్పులకు ఆజ్యం పోసిన కంపెనీల్లో పేటీఎం కూడా చెప్పుకోదగిన పాత్రను కలిగి ఉంది. అయితే విజయశేఖర్ శర్మ కంపెనీని ఏ ముహూర్తంలో ప్రారంభించారో తెలియదు కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం కంపెనీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ చర్యల తర్వాత ఇది మరింతగా దిగజారింది.

ఈ క్రమంలోనే నేడు పేటీఎం స్టాక్ ఇంట్రాడేలో దాదాపు 9 శాతం పతనాన్ని చూడటంతో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్టాక్ ధర రూ.773.90 స్థాయికి పడిపోయింది. దీనికి కారణం క్రిప్టో కరెన్సీ స్కాంకి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న ఎనిమిది పేమెంట్ గేట్‌వే కంపెనీల్లో పేటీఎం కూడా ఉండటమేనని వెల్లడైంది. వాస్తవానికి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ పేమెంట్ గేట్‌వే లకు సంబంధించిన దాదాపు రూ.500 కోట్లను ఫ్రీజ్ చేశారని తెలుస్తోంది. ఇది చైనా కేంద్రంగా కొనసాగుతున్న క్రిప్టో మోసంగా అధికారులు చెబుతున్నారు.

Paytm Stock Tumbles over 9Percent in intraday amid ED probing over Crypto Scam Money Seized

ప్రస్తుతం ఈడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో పేటీఎంతో పాటుగా రేజర్ పే, పేయూ, ఈజ్ బజ్ సహా మరికొన్ని చెల్లింపు కంపెనీలు ఉన్నట్లు వెల్లడైంది. గడచిన రెండేళ్లుగా వీటికి సంబంధించిన వర్చువల్ ఖాతాల్లో దాదాపు రూ.500 కోట్లను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసి ఉంచారు. వీటికి చైనాలోని 10 కంపెనీలతో సంబంధం ఉన్నట్లు వారు చెబుతున్నారు. ఈ విషయంపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అడగగా పేటీఎం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని తెలుస్తోంది.

ఈ వార్తలతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్లు భారీ వాల్యూమ్ లలో ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. గడచిన రెండువారాల సగటు కంటే అధిక స్థాయిలో నేడు పేటీఎం షేర్లు మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.52,778 కోట్లుగా ఉంది. అలాగే ఉదయం 11.27 గంటల సమయంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.821.50 వద్ద 2.78 శాతం తగ్గుదలతో కొనసాగుతున్నాయి.

బ్రోకరేజ్ అభిప్రాయం ఇదే..
పేటీఎం కంపెనీ షేర్లపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పేటీఎం బలమైన మార్జిన్ ఇంక్రిమెంటల్ లాభదాయకత ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. మార్చి 2026 నాటికం కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.1,250 స్థాయికి చేరుకుంటుందని టార్గెట్ ధరను ప్రకటించింది. అలాగే ప్రస్తుతం పేటీఎం షేర్లకు తిరిగి BUY రేటింగ్ కొనసాగిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+