Paytm Stocks: దేశంలోని పేమెంట్స్ వ్యాపారంలో అనేక నూతన సాంకేతికతలను ఆవిష్కరించిన సంస్థ పేటీఎం. యూపీఐ చెల్లింపు వ్యవస్థను ముందుగా ప్రారంభించి చాలా మందికి చేరువ చేసింది.
అయితే ప్రస్తుతం కంపెనీ అనేక రెగ్యులేటరీ అడ్డంకులను ఎదుర్కొంటోంది. గతంలోనూ పలుమార్పు ఫిన్ టెక్ కంపెనీ వ్యాపారంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఐపీవోగా మార్కెట్లో వచ్చినప్పుడు నిరాశకు గురిచేసినప్పటికీ కంపెనీ తన పనితీరును మెరుగుపరుచుకుంటూ వేగంగా లాభదాయకమైన స్టార్టప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా RBI పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను మార్చి 1, 2024 నుంచి నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పేటీఎం షేర్ హోల్డర్లలో పెద్ద అలజడి మెుదలైంది. నేడు ఉదయం మార్కెట్లు ఓపెన్ కాగానే చాలా మంది పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయించేందుకు ఎగబడ్డారు. అలా కొన్ని క్షణాల్లోనే పేటీఎం స్టాక్ 20 శాతం క్షీణతకు గురైంది. దీంతో ఇంట్రాడేలో ఉదయం 9.28 గంటల సమయంలో పేటీఎం షేర్ ధర రూ.609 వద్ద ఉంది. అయితే ఈ అమ్మకాల ధోరణి రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క ఆర్బీఐ చర్యలు కంపెనీ ఆదాయాన్ని సైతం తగ్గించేవిగా ఉన్నట్లు వెల్లడికావటంతో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది.
ఇటీవల పేటీఎం వ్యాపారంపై జెఫరీస్ నోట్ రిలీజ్ చేస్తూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు కారణంగా కంపెనీ లెండింగ్ పార్టనర్లు వ్యాపారాన్ని పరిమితం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. అదే గనుక జరిగితే రుణవితరణ వ్యాపారం నుంచి వస్తున్న 20 శాతం ఆదాయంపై పరోక్షంగా ప్రభావం ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ ఆంక్షలు వారి సేవింగ్స్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లలోని వినియోగదారుల డిపాజిట్లపై ప్రభావం చూపవని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications