వ్యాపారులకు తక్కువ వడ్డీకే పేటీఎం రూ.5 లక్షల వరకు రుణం

డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం వచ్చే మార్చి నాటికి వ్యాపారులకు రూ.1000 కోట్ల రుణాన్ని అందజేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారులకు రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల రుణాలు అందించింది. ఇప్పుడు రెండింతలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాపారులకు 1 శాతం నుండి 2 శాతం మధ్య వడ్డీ రేటుతో రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు అందిస్తుంది.

బ్యాంకింగ్ రుణాలు అందుకోలేని కిరాణా స్టోర్స్, ఇతర చిన్న వ్యాపారులకు సహాయం చేయడానికి ఈ రుణాలు ఇస్తున్నామని తెలిపింది. తమ వద్ద ఉన్న 17 మిలియన్ వ్యాపారుల డేటా ఆధారంగా వెయ్యి కోట్ల రూపాయల రుణం అందిస్తామని తెలిపింది. ఈ రుణాలు వారి వ్యాపారాన్ని డిజిటలైజ్ చేసుకోవడానికి, కార్యకలాపాల విస్తృతం చేసుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపింది. మార్చి నాటికి ఈ రుణాలు అందిస్తామని తెలిపింది.

 Paytm raises collateral free loan cap to Rs 5 lakh for micro lenders

వ్యాపారం కోసం పేటీఎం యాప్‌ను ఉపయోగిస్తున్నవారికి మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను అందజేసే ప్రక్రియను కొనసాగిస్తామని ఆ కంపెనీ సోమవారం తెలిపింది. వ్యాపారులు తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుని డిజిటల్‌ ఇండియా కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ఈ రుణాలు దోహదపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీపై రూ.5 లక్షల వరకు రుణాలను అందజేసి వాటి అభివృద్ధికి దోహదపడేందుకు నిబద్ధతతో ఉన్నామని పేటీఎం తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+