ఆర్బీఐ మార్గదర్శకాలకు ఓకే, యూపీఐ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని, ఇందుకు వెంటనే చర్యలు చేపడతామని పేటీఎం పేమెంట్స్ బ్యాంకు శనివారం ప్రకటించింది. బ్యాంకులో కొన్ని పర్యవేక్షణ లోపాలు గుర్తించడంతో కొత్త ఖాతాలు తెరవడం నిలిపివేయాల్సిందిగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ రెండో రోజుల క్రితం ఆదేశించింది. 2017 మే నెలలో నోయిడా శాఖతో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించిన పేటీఎంపై కొత్త ఖాతాలు తెరువవద్దని ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇది రెండోసారి.

గతంలోను... తక్షణ చర్యలు

గతంలోను... తక్షణ చర్యలు

గతంలో 2018 జూన్ నెలలోను పర్యవేక్షణ లోపాలు గుర్తించడంతో ఒకసారి నిషేధించింది. ఆ తర్వాత సంస్థ నిబంధనలు పాటించడంతో 2018 డిసెంబర్ 31 నుండి ఆంక్షలు ఎత్తివేసింది. తాజాగా మళ్లీ లోపాలు గుర్తించడంతో కొత్త ఖాతాలు తెరువవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం ఐటీ వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు, ఒక ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకోవాలని కూడా సూచించింది.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది. బ్యాంకు తన ఐటీ సిస్టం సమగ్ర సిస్టం ఆడిట్ నిర్వహణకు ప్రముఖ బాహ్య ఆడిటర్‌ను నియమించడంతో పాటు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకుంటోందని, వారి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించడానికి రెగ్యులేటర్‌తో కలిసి పని చేయడానికి కట్టుబడి ఉందని పేటీఎం మాతృసంస్థ వన్97 ఓ ప్రకటనలో తెలిపింది.

యూపీఐ ఆధారంగా

యూపీఐ ఆధారంగా

ఎక్స్చేంజీలపై కంపెనీ దాఖలు ప్రస్తుత పరిస్థితి ఇప్పటికే వినియోగిస్తున్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. పేటీఎం యూపీఐ, పేటీఎం వ్యాలెట్, పేటీఎం ఫాస్టాగ్, బ్యాంకు ఖాతాల ప్రస్తుత కస్టమర్లు చెల్లింపుల కోసం డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్స్‌తో సహా ఈ సాధనాలను కొనసాగించవచ్చునని తెలిపింది.

అలాగే కొత్త కస్టమర్లు పేటీఎం యాప్‌లో సైన్-అప్ కావొచ్చు. ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. కస్టమర్లు యూపీఐ హ్యాండిల్స్‌ను సృష్టించి, ఆపై వాటిని వారి బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలి. వారు పేటీఎం యాప్‌లో ట్రాన్సాక్షన్స్ కోసం థర్డ్ పార్టీ చెల్లింపు సాధనాలను కూడా ఉపయోగించవచ్చు. అయితే కస్టమర్లు తదుపరి నోటీసు వరకు వన్97 నిర్దేశించిన కొత్త పీపీబీఎల్ వ్యాలెట్‌లు లేదా పీపీబీఎల్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాల కోసం సైన్-అప్ చేయలేరు.

నష్టాల్లో..

నష్టాల్లో..

కొత్త కస్టమర్లపై తాత్కాలిక నిలిపివేత గురించి మాట్లాడుతూ.. పీపీబీఎల్‌పై విధించిన చర్యలు పేటీఎం మొత్తం వ్యాపారాన్ని ప్రభావితం చేయవని పేటీఎం విశ్వసిస్తున్నట్లు తెలిపింది. ఇతర ఆర్థిక సేవల సంస్థల భాగస్వామ్యంతో పేటీఎం అందించే సేవలపై ఆర్బీఐ నిర్దేశం ప్రభావం చూపదని కంపెనీ వివరించింది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో సోమవారం పేటీఎం స్టాక్ శుక్రవారం స్వల్పంగా క్షీణించి రూ.774.80 వద్ద ముగిసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+