Paytm rename: ఆర్బీఐ పరిమితుల కారణంగా పేటీఎం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది. వివిధ వ్యాపార సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ వినియోగాన్ని హోల్డ్ చేశాయి. అయితే ఇదంతా జరిగే ముందే కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పేటీఎం ఇ-కామర్స్ దాని పేరును పై ప్లాట్ఫారమ్లుగా మార్చుకుంది. ఆన్లైన్ రిటైల్ వ్యాపారంలో వాటాను పొందుతున్న ONDCలో విక్రేత ప్లాట్ఫారమ్ అయిన బిట్సిలాను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితమే కంపెనీ పేరు మార్పు కోసం దరఖాస్తు చేసింది. దీంతో ఫిబ్రవరి 8 న కంపెనీల రిజిస్ట్రార్ నుంచి అనుమతి సైతం లభించింది.

'కంపెనీ పేరు పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పై ప్లాట్ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చబడింది. ఈ సర్టిఫికేట్ 8వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. కంపెనీ నిజానికి పేటీఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విలీనం చేయబడింది' అని ఫిబ్రవరి 8న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పేటీఎం ఇ-కామర్స్లో ఎలివేషన్ క్యాపిటల్ అతిపెద్ద వాటాదారు. కాగా దీనికి పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ, సాఫ్ట్బ్యాంక్ మరియు ఈబే మద్దతు కూడా ఉంది. 2020లో ప్రారంభించబడిన ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బిట్సిలా)ని కంపెనీ ఇప్పుడు కొనుగోలు చేసింది. హైపర్లోకల్ కామర్స్ సామర్థ్యంతో ONDC విక్రేత ప్లాట్ఫారమ్గా అది పనిచేస్తుంది.
ONDCలో మొదటి 3 విక్రయదారుల ప్లాట్ఫారమ్లలో బిట్సిలా ఒకటి. ఇది ONDCలో మెక్డొనాల్డ్స్, బిగ్బాస్కెట్ వంటి మార్క్యూ బ్రాండ్లకు మద్దతు ఇస్తుంది. 30 కంటే ఎక్కువ నగరాల్లోని 10 వేల స్టోర్లలో 600 మిలియన్లకు పైగా ఉత్పత్తులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. కిరాణా, ఆహారం మరియు పానీయాలు, ఫ్యాషన్, అందం, వ్యక్తిగత సంరక్షణ (BPC) మరియు గృహాలంకరణతో సహా వివిధ రంగాల సేవలను ప్లాట్ఫారమ్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications