ఇన్సూరెన్స్ రంగంలోకి బాబా రాందేవ్: అదార్ పూనావాలాతో డీల్.. ఎన్ని కోట్లు ఖర్చయ్యాయంటే ?

యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించబోతున్నారు. పతంజలి ఆయుర్వేద అండ్ రజనిగంధ బాండ్స్ నడుపుతున్న ఆయన నేతృత్వంలోని ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (DS గ్రూప్) సనోతి ప్రాపర్టీస్ LLP నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు రూ.4,500 కోట్లకి జరిగింది. ఈ కొనుగోలు డీల్ గురించి కంపెనీ గురువారం స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ అదార్ పూనవాలా అండ్ రైజింగ్ సన్ హోల్డింగ్స్ యాజమాన్యంలో ఉంది.

Patanjali Ayurveda buys Adar Poonawala company Magma General Insurance with this Baba Ramdev entries into insurance sector

పతంజలి ఆయుర్వేద & DS గ్రూప్‌తో వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం, సనోటి ప్రాపర్టీస్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ (గతంలో మాగ్మా HDI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ)ను సెలికా డెవలపర్స్ & జాగ్వార్ అడ్వైజరీ సర్వీసెస్‌కు విక్రయించడానికి ఆమోదం తెలిపిందని కంపెనీ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి రూ.4,500 కోట్లకి ఈ ఒప్పందం జరిగిందని కంపెనీ తెలిపింది.

కంపెనీ ఎం చేస్తుంటుంది: మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ వివిధ క్యాటగిరిలో 70కి పైగా జనరల్ ఇన్సూరెన్స్ రంగంలోని పూర్తి హెల్త్ కవరేజ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఈ కంపెనీ కస్టమర్లకు వెహికిల్, హెల్త్, పర్సనల్ ఆక్సిడెంట్, హౌస్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. కంపెనీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ లో ఫైర్, ఇంజనీరింగ్, మెరైన్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. సనోటి ప్రాపర్టీస్‌లో పూనావాలాకు 90% వాటా ఉండటంతో పూనావాలా తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకంగా పరిగణిస్తుంది.

పతంజలి ఆయుర్వేద ప్రతినిధి మాట్లాడుతూ, ఈ రంగం 100 శాతం ఎఫ్‌డిఐకి అవకాశం కల్పించడంతో సహా రెగ్యులేటరీ సంస్కరణల ద్వారా ముందుకు సాగుతోందని అన్నారు. భారతదేశంలో జనరల్ ఇన్సూరెన్స్ అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ. పతంజలి ఆయుర్వేద భారీ నెట్‌వర్క్ నుండి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందుతుంది. కంపెనీ ఉత్పత్తులు 2,00,000 షాపుల్లో అలాగే రిలయన్స్ రిటైల్, హైపర్ సిటీ, స్టార్ బజార్ ఇంకా 250 పతంజలి మెగా స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

అయితే 1,500 కోట్ల పెట్టుబడితో నాగ్‌పూర్‌లో నిర్మించిన మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో తాజాగా కార్యకలాపాలు ప్రారంభించినట్లు పతంజలి ఆయుర్వేద్ ప్రకటించింది. నాగ్‌పూర్‌లోని మిహాన్‌లో పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ మార్చి 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే యోగా గురువు రామ్‌దేవ్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు 800 టన్నుల సామర్థ్యంతో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+