బ్రిటానియా తర్వాత పార్లేజీ: ధరలు 5% నుండి 10% పెరుగుతున్నాయ్

ఉదయం లేవగానే చాలామంది టీ లేదా పాలలో బిస్కట్ తింటారు. మన వద్ద పార్లేజీ, టైగర్ బిస్కట్ చాలా ఫేమస్. కరోనా సమయంలో ఈ బిస్కట్ ధరలు యథాతథంగా ఉన్నప్పటికీ క్వాంటిటీ తగ్గింది. ఇటీవలే బ్రిటానియా తమ ఉత్పత్తుల ధరలను నాలుగు శాతం మేర పెంచింది. తాజాగా పార్లేజీ కూడా తమ ఉత్పత్తులపై 5 శాతం నుండి 10 శాతం మేర పెంచనుంది. అన్ని రకాల ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఉత్పత్తి వ్యయం పెరుగడం వల్ల ధరలు పెంచవలసి వచ్చిందని, ముఖ్యంగా ముడి సరుకులు చక్కెర, గోధుమ, వంటనూనెల ధరలు పెరిగినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నిర్ణయంతో పార్లే-జీ, హైడ్ అండ్ సీక్, క్రాక్-జాక్ ధరలు 5 శాతం నుండి 10 శాతం వరకు పెంచుతున్నామని, రస్క్, కేక్ 7 శాతం నుండి 8 శాతం వరకు, మోస్ట్ పాపులర్ గ్లూకోజ్ బిస్కట్ 6 శాతం నుండి 7 శాతం వరకు పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక, రూ.10, రూ.20, రూ.30 ధరలు కలిగిన బిస్కట్ ప్యాకెట్ ధరలు పెంచడం లేదు. కానీ పరిమాణాన్ని తగ్గిస్తుంది.

Parle Products hikes biscuit prices by 5-10 percent

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పార్లేజీ బిస్కట్ కంపెనీ ధరలు పెంచడం ఇది మొదటిసారి. అంతకుముందు జనవరి-మార్చి త్రైమాసికంలో ధరలు పెంచింది. గత ఏడాది కాలంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు 50 శాతం నుండి 60 శాతం పెరిగాయని, అలాగే చక్కెర ధరలు ఎనిమిది శాతం నుండి పది శాతం పెరిగాయని, గత ఏడాదితో పోలిస్తే ధరలు ఈ మేరకు పెరగడంతో తాము ధరలు పెంచవలసి వస్తుందని చెప్పారు. అలాగే, రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని తెలిపింది. అంతకుముందు గత నెలలో బ్రిటానియా ఇండస్ట్రీస్ ధరలు పెంచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+