Paisa Double: స్టాక్ మార్కెట్లో ఏదైనా జరగొచ్చు. అందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. అవి లాభాలైనా లేక నష్టాలైనా సరే. అయితే ప్రస్తుతం ఒక బ్యాంకింగ్ షేర్ దూకుడు దీనినే సూచిస్తోంది. పైగా ఇదొక ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ కావటం చాలా మంది ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు కాసుల వర్షం కురిపిస్తున్న బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
బ్యాంకుల్లో డబ్బును దాచుకొని వడ్డీ ఆదాయాన్ని పొందుతూ సంతృప్తి పడేరోజులు పోయాయి. అదంతా పాతకాలం పద్దతి. కానీ ఇప్పుడు చాలా మంది స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి త్వరగా తమ సంపదను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నారు. అలా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.

గరిష్ఠాలకు స్టాక్..
నవంబర్ 14న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేరు ధర రూ.18.4 వద్ద ఉంది. అయితే ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి 10 శాతం అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయ్యి రూ.40.85 వద్ద ఎన్ఎస్ఈలో ఉంది. దీంతో షేర్ తన కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.ఈ క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.13 వద్ద ఉంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగంలోని మాత్రమే కాక ప్రైవేటు యాజమాన్యంలోని బ్యాంకింగ్ షేర్లు సైతం మంచి పనితీరుతో తమ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

లక్షను రూ.2 లక్షలు..
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ షేర్లు 13 ట్రేడింగ్ రోజుల నుంచి దాదాపుగా 99 శాతం మేర పెరిగాయి. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కేవలం ఈ బ్యాంక్ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ఇప్పుడు దాని విలువ రూ.2 లక్షలకు చేరుకునేది. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టాక్ తన ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. మెుత్తంగా స్టాక్ ఈ ఏడాది 148 శాతం వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మంచి లాభాలను నమోదు చేసి, మెరుగైన పనితీరు కనబరచటం దీనికి కారణంగా నిలుస్తోంది.
More From GoodReturns

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications