హైదరాబాద్ వాసులకు 'గోవా' అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్ వస్తే చాలు స్నేహితులతో కలిసి కారు వేసుకుని గోవా బీచ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్ల ద్వారా ప్రయాణం కొంచెం అలసటగా, ఎక్కువ సమయం తీసుకునేదిగా ఉంది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పానాజీ హైదరాబాద్ హైవే (Panaji-Hyderabad National Highway) ప్రాజెక్టును వేగవంతం చేసింది.

రూ. 12,000 కోట్లతో 'భారత్మాల' ప్రాజెక్ట్
కేంద్ర ప్రభుత్వ 'భారత్మాల పరియోజన' కింద సుమారు 12 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ 4- లేన్ ఎక్స్ప్రెస్వేను నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు.. తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను కలిపే ఒక అతిపెద్ద ఎకనామిక్ కారిడార్. 2025 చివరి నాటికి ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో భూసేకరణ 90 శాతం పూర్తయ్యి నిర్మాణం ఊపందుకుంది.
తక్కువ జర్నీ టైం..
ప్రస్తుతం హైదరాబాద్ నుండి గోవా వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈ కొత్త 4-లేన్ హైవే అందుబాటులోకి వస్తే.. టైం చాలా తగ్గుతుంది. ఇది యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు కాబట్టి వాహనాలు హై స్పీడ్తో వెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లోని ఐటీ, ఫార్మా రంగాలను గోవాలోని టూరిజం, ఫార్మా హబ్లతో ఈ హైవే నేరుగా కలుపుతుంది. రాయచూరు, బాగల్కోట్, బెల్గాం జిల్లాల మీదుగా ఈ రోడ్డు పనాజీకి చేరుకుంటుంది.
ప్రాజెక్టు ప్రత్యేకతలు ఇవే..
- మొత్తం నాలుగు ప్యాకేజీలు: కర్ణాటకలో ఈ ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించారు. బాగల్కోట్ జిల్లాలోనే 102 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు సాగనుంది.
- భారీ ఫ్లైఓవర్లు: ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కేవలం బాగల్కోట్ జిల్లాలోనే 9 భారీ ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు.
- కొత్త రూట్: ఈ హైవే రాయచూరులోని సిర్వార్, కవితాళ్ మీదుగా బాగల్కోట్ లోని అమీనగడ్, కేరూర్ వంటి ప్రాంతాల ద్వారా ప్రయాణించి బెల్గాం చేరుకుంటుంది.
వ్యాపార, పారిశ్రామిక రంగానికి ఊతం
ఈ హైవే కేవలం టూరిస్టులకే కాదు.. రైతులకు, వ్యాపారస్తులకు కూడా వరప్రదాయిని కానుంది. రాయచూరులోని వ్యవసాయ ఉత్పత్తులు (పత్తి, పండ్లు), బాగల్కోట్లోని సిమెంట్, ఖనిజాలు, గోవాలోని మత్స్య సంపదను వేగంగా తరలించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రూట్ అంతా కొత్తగా నిర్మిస్తుండటంతో, హైవే పొడవునా కొత్త హోటళ్లు, సర్వీస్ సెంటర్లు మరియు వాణిజ్య సంస్థలు వెలిసే అవకాశం ఉంది.
ఎప్పటికి పూర్తవుతుంది?
మధ్యలో కొన్ని భూసేకరణ సమస్యలు ఉన్నప్పటికీ.. కేంద్ర మంత్రిత్వ శాఖ నిధులను విడుదల చేసి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. రాబోయే రెండేళ్లలో అంటే.. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాగల్కోట్ ఎంపీ పి.సి. గడ్డిగౌడర్ మాట్లాడుతూ.. ఇప్పటికే రైతులకు పరిహారం పంపిణీ వేగవంతమైందని, ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధిని మార్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సో.. గోవా లవర్స్! మరో రెండేళ్లు ఓపిక పడితే.. హైదరాబాద్ నుండి పానాజీకి సూపర్ ఫాస్ట్ హైవే మీద దూసుకుపోవచ్చు!
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications