పాకిస్తాన్ vs ఇండియా: రైల్వే ఉద్యోగుల జీతం ఎంతో తెలుసా.. వామ్మో తెలిస్తే నమ్మలేరు..

ఏదైనా జాబ్ చేస్తే సాధారణంగా 15 వేల నుండి 20 వేల జీతం లభిస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మాత్రం మొదట బేసిక్ పే స్కెల్, ఆ తరువాత రెగ్యులర్ పే స్కెల్ ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం ఉంటె కొన్ని అలవెన్సులు, ప్రభుత్వ సహకారాలు కూడా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ అంశం చాలా వేడెక్కింది. మనం ఫ్లయిట్ హైజాక్ చేయడం గురించి సినిమాల్లో ఎక్కువగా వింటుంటాం. కానీ ట్రైన్ హైజాక్ చేయడం అరుదు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాక్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఈ ఆపరేషన్ ముగిసిందని వాదిస్తుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఇప్పటికీ 154 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మా అదుపులో ఉన్నారని పేర్కొంది. ట్రైన్ హైజాక్ కావడానికిగల కారణాలను పెక్కనపెడితే అసలు ట్రైన్ హైజాక్ ఎలా సాధ్యం ఇంకా దీనికి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తింది. ఇంకా ట్రైన్ డ్రైవర్లకు జీతాల గురించి కూడా చర్చ మొదలైంది.

Pakistan vs indian railway how much salary Pakistani railway driver get when compare to India railway locopilots

పాకిస్తాన్‌లో ట్రైన్ డ్రైవర్ (లోకో పైలట్) జీతం గురించి మాట్లాడుకుంటే భారతదేశంతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే మన భారతీయ కరెన్సీకి పాకిస్తాన్‌ కరెన్సీకి ఉన్న తేడా.. మీడియా నివేదికల ప్రకారం పాకిస్తాన్‌లో ట్రైన్ డ్రైవర్ జీతం 16,710 పాకిస్తానీ రూపాయలు (అంటే సుమారు 5202 రూపాయలు) నుండి 43,936 పాకిస్తానీ రూపాయలు (సుమారు 14 వేల రూపాయలు) వరకు ఉంటుంది. జీతం కాకుండా వారికి అలవెన్సులు ఇతర రకాల సౌకర్యాలు కూడా లభిస్తాయి.

జీతాల పెంపు: కాలక్రమేణా పాకిస్తాన్‌లో ట్రైన్ డ్రైవర్ల జీతంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. నివేదికల ప్రకారం, 5 సంవత్సరాల సర్వీస్ అందించిన తర్వాత వీరి జీతం 57 వేల పాకిస్తానీ రూపాయలకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఓవర్ టైం, అలవెన్సుల కారణంగా జీతం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ట్రైన్ డైవర్లకు ట్రావెల్ అలవెన్సులతో పాటు మెడికల్ సౌకర్యాలు, పెన్షన్ కూడా లభిస్తాయి. మరోవైపు పాకిస్తాన్ రైల్వే ఉద్యోగులు జీతాల పెంపు కోసం నిరసనలు కూడా చేస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే జీతం చాలా తక్కువ అని వారు అంటున్నారు.

భారతదేశంలో ట్రైన్ డ్రైవర్ల జీతం ఎంత: భారతదేశంలో రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తారు. దింతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే అన్ని సౌకర్యాలు రైల్వే ఉద్యోగులకు కూడా అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో లోకో పైలట్ జీతం పాకిస్తానీ ట్రైన్ డ్రైవర్ జీతం కంటే చాలా ఎక్కువ. భారతదేశంలో ట్రైన్ డ్రైవర్ ప్రారంభ జీతం రూ. 50-60 వేల నుండి మొదలవుతుంది. వారిని అసిస్టెంట్ లోకో పైలట్లు అంటారు. అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్ కావడానికి దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డియర్నెస్ అలవెన్స్ పెంచుతుంది. ఇంకా జీతం పెరుగుతూనే ఉంటుంది. లోకో పైలట్ అయిన తర్వాత వారి జీతం నెలకు దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంటుంది. జీతంతో పాటు ట్రైన్ డ్రైవర్‌కు మెడికల్ & ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+