పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులను ముమ్మరం చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా రెండు దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ యుధ్ధంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి. ఏ దేశానికి సపోర్ట చేయాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే ఇరాన్ ప్రధానంగా సౌదీ అరేబియా డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. సౌదీ అరేబియా, యూఎఈ వంటి ఇతర గల్ఫ్ దేశాలపై బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ రెచ్చిపోతంది.
ఈ పరిణామాలు దాయాది దేశం పాకిస్థాన్ను రెండు ప్రధాన శక్తుల మధ్య సున్నితమైన పరిస్థితిలో నిలబెట్టాయి. ఇరాన్తో సంబంధాలు ఉన్నా, సౌదీ అరేబియాతో దీర్ఘకాల సంబంధాలు పాకిస్థాన్కు ఉన్నాయి. ఓ వైపు పాకిస్థాన్ ఇరాన్తో సుమారు 900‑కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. మరోవైపు లక్షలాది పాకిస్థానీలు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నందున ఆర్థికంగా రెండు దేశాల ప్రభావం దేశంపై ఉంది. ఇరాన్, సౌదీ అరేబియాతో తటస్థంగా ఉండటానికి Pakistan తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

2025 సెప్టెంబర్లో పాకిస్థాన్- సౌదీ అరేబియా మధ్య ఒక ప్రముఖ రక్షణ ఒప్పందం (Strategic Mutual Defence Agreement) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, ఎక్కడైనా ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నది. అయితే నిపుణులు చెబుతున్నది ఏమిటంటే.. ప్రత్యేక రక్షణ బలాన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితి లేనప్పటికీ, భవిష్యత్తులో ఒత్తిడి పెరగడం ఆశ్చర్యం కాదు. ఈ ఒప్పందంతో పాకిస్థాన్ ఇరాన్కు తన రక్షణ బాధ్యతను గుర్తు చేసింది. అలాగే ఇరాన్ కూడా సౌదీ ఎయిర్స్పేస్ను ఉపయోగించకుండా ఉండటానికి సమ్మతించింది.
ఇరాన్తో పాకిస్థాన్కి సుదీర్ఘ సరిహద్దు సంబంధాలు ఉన్నాయి. 2025 ఆగస్టులో ఇరాన్ అధ్యక్షుడు ఇస్లామాబాదు సందర్శించి.. రెండు దేశాల మధ్య ఉన్న మద్యస్థతా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. పాకిస్థాన్ సరిహద్దు వ్యాపారం, భద్రతా బాధ్యతలు, శరణార్థుల సమస్యలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్లోని సియా సముదాయాల ప్రభావం కూడా ఇరాన్ వైపు తీరులను మద్దతు చేయవచ్చు. ఇది దేశ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేస్తుంది.
మధ్యప్రాచ్య యుద్ధం కొనసాగుతున్నందున, ఇంధన సరఫరాలు, దిగుమతులు, ఆర్థిక సంబంధాలు పాకిస్థాన్కి ముఖ్యమైనవి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే, ధరల పెరుగుదల, ఆర్థిక ఒత్తిడి, శరణార్థుల ప్రవాహం వంటి సమస్యలు దేశాన్ని గంభీరంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రభుత్వం జాగ్రత్తగా.. డిప్లొమాటిక్ మార్గంలో తటస్థంగా వ్యవహరిస్తోంది. అయితే నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, ఈ తటస్థత్వాన్ని దీర్ఘకాలం నిలబెట్టడం కష్టంగా ఉంటుంది. ఒకవైపు సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు, సంప్రదాయ మైత్రి ఉన్నప్పటికీ, మరోవైపు ఇరాన్ను తట్టుకోవడంలో కూడా సౌలభ్యం కావాలి.
పాకిస్థాన్ ప్రస్తుతం మధ్యస్థ పాత్రలో ఉంది. తటస్థతను కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంది, కానీ భవిష్యత్లో గల్ఫ్ దేశాలు ఏదైనా యుద్ధ చర్యలకు నేరుగా దిగితే, పాకిస్థాన్ మీద ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, పాకిస్థాన్ దీర్ఘకాలం తటస్థంగా ఉండగలదా అనే ప్రశ్నకు స్పష్టంగా సమాధానం కష్టం. అయితే పరిస్థితులు మాత్రం తీవ్రతరం కావచ్చని అనలిస్ట్లు సూచిస్తున్నారు.
More From GoodReturns

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ దౌత్యం ఫలించిందా?

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు.. హార్ముజ్ జలసంధి రవాణాపై ట్రంప్కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..

ముంచుకొస్దున్న గ్యాస్ ముప్పు.. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నౌకలు.. నష్టం రూ. 10 వేల కోట్ల పై మాటే.

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

చమురు ధరలు పెరుగుదల.. ఖర్చులు భరించలేకున్నాం.. వెంటనే వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్..

భారీగా పెరిగిన ఎరువుల ధరలు.. సంక్షోభం దిశగా వ్యయసాయ రంగం.. రైతన్న విలవిల..

మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. ఇరాన్ యుద్దం క్షణాల్లో ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు..

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్



Click it and Unblock the Notifications
