Pakistan News: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. మోయలేని అప్పుల భారానికి ద్రవ్యోల్బణం తోడై ఖర్చులను అమాంతం పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో తనను తాను కాపాడుకునేందుకు పాక్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అయిన మార్గాన్నే ఎంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు.. చెలామణిలో ఉన్న అత్యధిక విలువ కలిగిన 5,000 రూపాయల నోటును రద్దు చేయాలని పాకిస్థాన్కు చెందిన ఆర్థికవేత్త ఒకరు సూచించారు. ఈ మార్గాన్ని అనుకరించిన భారతదేశంలో అద్భుత ఫలితాలు రావటంతో పాటు పన్ను వసూళ్లు కూడా పెరిగాయని ఎనర్జీ ఎకనామిస్ట్ అయిన అమ్మర్ ఖాన్ ఇటీవల అన్నారు.

విదేశీ మారక నిల్వల క్షీణతను ఎదుర్కొంటున్న పాక్ ద్రవ్యోల్బణంతో పాటు పన్ను రాబడి తగ్గటాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ నుంచి నిధులు రాకపోతే శ్రీలంక మాదిరిగానే డిఫాల్ట్ అయ్యే ప్రమాదంలో పడనుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. భౌతిక కరెన్సీ చెల్లింపుల వినియోగం వల్ల.. పన్నులు చెల్లించని అనధికారిక ఆదాయం పాక్ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువైందని ఆర్థిక వేత్త చెప్పారు. ఈ క్రమంలో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను చెలామణి నుంచి రద్దు చేయాలని వీటిని ఎక్కువగా కలిగి ఉండేది ధనవంతులేనని వారు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఎక్కువగా పన్ను చెల్లించని డబ్బు రొటేట్ అవుతోందని ఆర్థిక వేత్త నజం అలీ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లావాదేవీలకు పాకిస్థాన్ కరెన్సీ వినియోగాన్ని తగ్గించి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని అన్నారు. దీనికి ముందు భారత ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఆర్థిక వ్యవస్థలోని నల్లధనాన్ని వెలికితీయటమే లక్ష్యంగా మోదీ సర్కార్ ఈ సాహనాన్ని చేసింది. ఆ తర్వాత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావటంతో డిజిటల్ చెల్లింపుల యుగం విజయవంతంగా కొనసాగుతోంది.
దీనిపై స్పందిస్తున్న కొంతమంది భారతదేశంలో చేపట్టిన నోట్ల రద్దు చిన్న వ్యాపారులు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పాక్ ఆర్థిక వేత్తలు పరగణలోకి తీసుకోవాలన్నారు. నోట్ల రద్దును పాక్ లో అమలు చేస్తే అక్కడి ధనవంతులు తమ సంపదను బంగారం లేదా అమెరికన్ డాలర్లలోకి మార్చుకునే అక్రమమార్గాలను ఆశ్రయిస్తారని నరోవల్ జిల్లా మాజీ మేయర్ అహ్మద్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications