దక్షిణాసియా రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న గెరిల్లా దాడులు, ఇప్పుడు నేరుగా యుద్ధం (War) దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వంతో ఇకపై 'ఓపెన్ వార్' (Open War) మొదలైందని ఆయన ప్రకటించడంతో సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది.

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఏమన్నారు?
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి గురించి మాట్లాడుతున్నప్పటికీ, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం దూకుడుగా స్పందించారు. "మా ఓపిక నశించింది, ఇకపై నిర్ణయాత్మక చర్యలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు. అఫ్గాన్ భూభాగం నుంచి పాకిస్థాన్పై ఉగ్రదాడులు జరుగుతున్నాయని, దీనికి తాలిబన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. కాబూల్ లో పేలుళ్లు సంభవించడం, సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగడం ఈ ఉద్రిక్తతలకు నిదర్శనం.
డ్యూరాండ్ లైన్: వివాదానికి అసలు కారణం
పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉన్న 2,640 కిలోమీటర్ల సరిహద్దును 'డ్యూరాండ్ లైన్' (Durand Line) అని పిలుస్తారు. బ్రిటీష్ కాలంలో గీసిన ఈ రేఖను పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తోంది. కానీ, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య సాంస్కృతిక, భాషా సంబంధాలు బలంగా ఉన్నాయి. 2021లో అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఈ సరిహద్దులో ఇప్పటివరకు దాదాపు 75 సార్లు ఘర్షణలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
శరణార్థుల కష్టాలు.. తాజా దాడులు..
సరిహద్దు ప్రాంతమైన తోర్ఖం (Torkham) వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్థాన్ నుంచి వెనక్కి పంపబడుతున్న అఫ్గాన్ శరణార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరి కోసం ఏర్పాటు చేసిన క్యాంపులను కూడా ఖాళీ చేయించారు. మరోవైపు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పందిస్తూ.. పాకిస్థాన్ తన తప్పుల వల్ల కలిగిన హింసను అఫ్గాన్ పై రుద్దకూడదని, పొరుగు దేశంగా గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం (Pakistan Afgan War) జరిగితే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. దక్షిణ ఆసియా మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఏడు సార్లు అఫ్గాన్ పై వైమానిక దాడులు చేసింది.
ఇప్పుడు స్నేహపూర్వక దేశాలు.. ఈ రెండు దేశాలతో మధ్యవర్తిత్వం వహించి ఈ ఉద్రిక్తతలను తగ్గించకపోతే.. పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. ఉగ్రవాదం, అస్థిరత వంటి సమస్యలు ఇరు దేశాలను పట్టిపీడిస్తున్న తరుణంలో ఈ యుద్ధం ఎవరికీ మేలు చేయదు.
ప్రస్తుతానికి సరిహద్దుల్లో సైన్యం మోహరింపు పెరిగింది. ప్రయాణికులు , వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications