దక్షిణాసియా రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న గెరిల్లా దాడులు, ఇప్పుడు నేరుగా యుద్ధం (War) దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాలిబన్ ప్రభుత్వంతో ఇకపై 'ఓపెన్ వార్' (Open War) మొదలైందని ఆయన ప్రకటించడంతో సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది.

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఏమన్నారు?
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి గురించి మాట్లాడుతున్నప్పటికీ, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం దూకుడుగా స్పందించారు. "మా ఓపిక నశించింది, ఇకపై నిర్ణయాత్మక చర్యలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు. అఫ్గాన్ భూభాగం నుంచి పాకిస్థాన్పై ఉగ్రదాడులు జరుగుతున్నాయని, దీనికి తాలిబన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు. కాబూల్ లో పేలుళ్లు సంభవించడం, సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగడం ఈ ఉద్రిక్తతలకు నిదర్శనం.
డ్యూరాండ్ లైన్: వివాదానికి అసలు కారణం
పాకిస్థాన్ , ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉన్న 2,640 కిలోమీటర్ల సరిహద్దును 'డ్యూరాండ్ లైన్' (Durand Line) అని పిలుస్తారు. బ్రిటీష్ కాలంలో గీసిన ఈ రేఖను పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తోంది. కానీ, ఆఫ్ఘనిస్థాన్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య సాంస్కృతిక, భాషా సంబంధాలు బలంగా ఉన్నాయి. 2021లో అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఈ సరిహద్దులో ఇప్పటివరకు దాదాపు 75 సార్లు ఘర్షణలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
శరణార్థుల కష్టాలు.. తాజా దాడులు..
సరిహద్దు ప్రాంతమైన తోర్ఖం (Torkham) వద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్థాన్ నుంచి వెనక్కి పంపబడుతున్న అఫ్గాన్ శరణార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరి కోసం ఏర్పాటు చేసిన క్యాంపులను కూడా ఖాళీ చేయించారు. మరోవైపు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పందిస్తూ.. పాకిస్థాన్ తన తప్పుల వల్ల కలిగిన హింసను అఫ్గాన్ పై రుద్దకూడదని, పొరుగు దేశంగా గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం (Pakistan Afgan War) జరిగితే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు. దక్షిణ ఆసియా మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పాకిస్థాన్ ఏడు సార్లు అఫ్గాన్ పై వైమానిక దాడులు చేసింది.
ఇప్పుడు స్నేహపూర్వక దేశాలు.. ఈ రెండు దేశాలతో మధ్యవర్తిత్వం వహించి ఈ ఉద్రిక్తతలను తగ్గించకపోతే.. పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉంది. ఉగ్రవాదం, అస్థిరత వంటి సమస్యలు ఇరు దేశాలను పట్టిపీడిస్తున్న తరుణంలో ఈ యుద్ధం ఎవరికీ మేలు చేయదు.
ప్రస్తుతానికి సరిహద్దుల్లో సైన్యం మోహరింపు పెరిగింది. ప్రయాణికులు , వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications