Oracle Layoffs: గ్లోబల్ టెక్ కంపెనీలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఖర్చు తగ్గింపులు చేసుకుంటూ భవిష్యత్తు మీద తమ దృష్టిని పెడుతున్నాయి. AI తో వ్యాపారాన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కూడా తొలగిస్తున్నాయి.మహమ్మారి పోయినా ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతూనే ఉంది. AI సేవలు ఖరీదైనవి కాబట్టి, దీని నిర్వహణ కోసం అధిక ఖర్చులను భరించవలసి వస్తోంది. దీని కోసం ఉద్యోగులను కూడా తొలగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో, పెద్ద కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు, తొలగింపులు చేపడుతున్నాయి.
ఇప్పటికే ఎన్నో కంపెనీలే లేఆప్స్ చేపట్టాయి. తాజాగా వీటి సరసన ఒరాకిల్ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ తన అత్యంత శక్తివంతమైన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. కృత్రిమ మేధస్సు (AI) మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అయ్యే భారీ ఖర్చులను తట్టుకోవడమే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఇటీవల తొలగించబడిన ఉద్యోగులలో చాలా మంది పనితీరు సంబంధిత కారణాల వల్ల తొలగించబడినట్లు కనిపిస్తోంది. ఇంతలో ఉద్యోగులను ఓ వైపు తీసేస్తున్న ఒరాకిల్ ఈ విభాగంలో కొత్త ఉద్యోగులను నియమించుకోవడం కొనసాగిస్తోంది. ఏఐకి పెద్ద పీట వేస్తునన్న కంపెనీ 500 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకునేందుకు వీలుగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఎంత మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడిందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

సియాటిల్-ఏరియా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం నుండి 150 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీని గురించి ఒరాకిల్ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వార్తను టెక్ న్యూస్ మ్యాగజైన్ డేటాసెంటర్ డైనమిక్స్ ధృవీకరించి ప్రచురించింది.AI పెరుగుదల, క్లౌడ్ కంప్యూటింగ్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఒరాకిల్ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి, దీనితో ఒరాకిల్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ మొదటిసారిగా ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు.
అయితే తాజాగా కంపెనీ 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.అదనంగా, ఒరాకిల్ గత సంవత్సరం తన ప్రధాన కార్యాలయాన్ని నాష్విల్లేకు మారుస్తున్నట్లు ప్రకటించింది. దీని వలన కొంతమంది ఉద్యోగుల తొలగింపులు కూడా జరిగాయి.మైక్రోసాఫ్ట్ కార్ప్ ఈ సంవత్సరం 15,000 ఉద్యోగాలను తగ్గించింది.టీసీఎస్,గూగుల్, అమెజాన్, మెటా వంటి పలు దిగ్గజ ఐటీ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..



Click it and Unblock the Notifications