న్యూఢిల్లీ: రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan scheme) పథకాన్ని ప్రారంభించింది. దీంతో కోట్లాది మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి ఏడాది విడతల వారీగా మొత్తం రూ.6,000 మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తుంది. దీనిని పెట్టుబడి సాయంగా అందిస్తున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు కావాలంటే బ్యాంకు ఖాతాను ఆధార్కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఇంగ్లీష్ పత్రికల్లో వార్తలు వచ్చాయి.

పీఎం కిసాన్ నిధులకు ఆధార్ అనుసంధానం
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధుల కోసం బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేసుకునే అంశాన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ పథకాన్నికి ఎలాంటి నిబంధనలు లేవు. నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంకు - ఆధార్ లింక్ తప్పనిసరి అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. తొలిసారి ఈ నిబంధన తెరపైకి తెచ్చారు.

వినిమయ శక్తి పెంచేందుకు..
ప్రస్తుతం రూ.10 వేల కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించి డిమాండుకు ఊతమివ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. జీడీపీ వృద్ధి రేటు భారీగా తగ్గుతోందని, ఈ నేపథ్యంలో గ్రామీణ భారతంలో వినిమయ శక్తిని పెంచేందుకు రూ.10,000 కోట్లను రైతులకు ఒకే రోజు ఇవ్వనున్నామని అధికారులు చెబుతున్నారు.

ఆధార్ అనుసంధానం
ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు తాజా విడత PM Kisan నిధులు వస్తాయని, ఈసారి దాదాపు రూ.10 వేల కోట్లను ఒకేరోజు అందచేసే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. 50 మిలియన్ బ్యాంకు అకౌంట్లకు పైగా అధికారులు లింక్ అయినట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications