పశ్చిమాసియా భగ్గుమంటోంది. అణుక్షణం మిస్సైల్ దాడులతో వణికిపోతోంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్దం తీవ్రం కావడంతో ప్రపంచం మొత్తం షేక్ అవుతోంది. దాడులు, ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ అంతటా భయానక వాతావరణం నెలకొంది. ఈ యుద్దం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనపడటం లేదు.
ఈ యుధ్దం త్వరలో ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనికి ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ విసిరింది. యుద్ధం ఆగిపోవడం మా చేతుల్లో ఉంది నీ చేతుల్లో లేదు అంటే అమెరికాకు ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అయితే ఈ యుద్ధాన్ని ఆపాలంటే భారత ప్రధాని మోదీ వల్లే సాధ్యమని యూఏఈ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమస్యను ఒకే ఫోన్ కాల్తో ఆపగల వ్యక్తి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జాతీయ వార్తా సంస్థ ఎన్డీ టీవితో మాట్లాడుతూ.. మోదీకి ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల నాయకుల వద్ద కూడా విశ్వసనీయమైన సంబంధాలు ఉన్నాయని.. ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధ పరిస్థితి తక్షణమే పరిష్కారమవుతుందని మీర్జా పేర్కొన్నారు.
మోదీ అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ ప్రతినిధులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. సమస్య తక్షణమే పరిష్కారమవుతుంది. అంతటి గౌరవం ఆయనకు ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, గల్ఫ్ దేశాల నేతలలో మాత్రమే కాకుండా..అక్కడి వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజల్లో కూడా మోదీకి ఉన్న క్రెడిబిలిటీ ఎంతో బలమైనదని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా.. మోడీ మధ్యప్రాచ్యం శాంతికి కీలక పాత్ర వహించగల స్థితిలో ఉన్నారని ప్రపంచానికి సూచనలొచ్చాయి.
UAE భూభాగాన్ని ఈ యుద్ధానికి వేదికగా వాడుకోవడం గురించి కూడా మీర్జా స్పష్టత ఇచ్చారు. యూఏఈ భూభాగాన్ని ఏ పక్షం కూడా లాంచింగ్ ప్యాడ్గా వాడుకోవడానికి మేము అనుమతించమని ఆయన తెలిపారు. UAE, ఇరాన్కి పొరుగు దేశంగా ఉండటమే కాక ఇటు అబ్రహం ఒప్పందంద్వారా ఇజ్రాయెల్కు భాగస్వామిగా ఉన్న దేశంగా.. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అందుకే, UAE ప్రస్తుత ఘర్షణలో ప్రత్యక్షంగా కలిసికట్టుగా ఉండకుండా.. శాంతిని నెలకొల్పే వైపుకు దృష్టి పెట్టడమే దాని ఉద్దేశ్యమని వివరించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మాదిరిగానే.. మధ్యప్రాచ్యానికి చెందిన దేశాలు, గ్లోబల్ పవర్లు కూడా ఈ సమస్యను దృష్టిలో ఉంచి ముందుకు వెళుతున్నాయి. ఇక్కడ భారత ప్రధాని మోదీ వ్యక్తిగతంగా చేయగల సమన్వయ ప్రయత్నం, గ్లోబల్ వేదికపై శాంతిని చాటే అవకాశం కలిగిందని UAE రాయబారి అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఒకే ఫోన్ కాల్తో యుద్ధం ఆగిపోవచ్చని UAE రాయబారి వ్యాఖ్యలు, భారతదేశ శాంతి, డిప్లమాటిక్ శక్తిని మళ్లీ ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయని చెప్పవచ్చు.
More From GoodReturns

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు..డబుల్ గేమ్ మొదలు పెట్టిన చైనా.. గగ్గోలుపెడుతున్న ట్రంప్ ..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్

హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ భారీ స్కెచ్.. 500 బిలియన్ డాలర్ల రెవిన్యూ టార్గెట్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. పిచ్చెక్కిపోతున్న ట్రంప్.. ఈ రోజు రాత్రే అసలు కథ..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికాకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ కథ కంచికి..



Click it and Unblock the Notifications