ev: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలను కాదని ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు భారత్ మొగ్గుచూపుతోంది. విద్యుత్ బైక్ లు, కార్లు ఇప్పటికే మార్కెట్లో ప్రజల అందిరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 1 శాతంగా ఉన్న EV వాహనాల వినియోగాన్ని రానున్న రోజుల్లో మరింతగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో EVలకు సంబంధించి కార్లు, బ్యాటరీల తయారీ కోసం ఓలా సంస్థ 920 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.

ఇకపై కార్లు, బ్యాటరీలు
ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీ కోసం EVల తయారీ సంస్థ ఓలా.. తమిళనాడులో 920 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.7,614 కోట్లతో నాలుగు చక్రాల వాహనాలు, 20 గిగావాట్ల బ్యాటరీ తయారీ సామర్థ్యం ఏర్పాటుకు సంస్థతో MOU కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఓలా తన అనుబంధ సంస్థలు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ మరియు ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనుంది.

పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యం
రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.50 లక్షల ఉద్యోగాలను సృష్టించడాన్ని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫిబ్రవరి 14న కొత్త EV పాలసీని అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఓలాతో కుదిరిన ఒప్పందం వల్ల 3,111 మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రపంచవ్యాప్త విస్తరణ
తమిళనాడులో ఓలా ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం లక్షకు పైగా ఉత్పత్తి చేస్తోంది. కొత్త పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో కార్లు, బ్యాటరీల తయారీకి సైతం సిద్ధమవుతోంది. ఏటా లక్షా 40 వేల కార్లను ఉత్పత్తి చేసేందుకు 3 వేలకు పైగా కార్మికులను కొత్తగా నియమించుకోవాలని చూస్తోంది. గతేడాది సెప్టెంబరులో నేపాల్ లోకి ప్రవేశించిన ఓలా.. లాటిన్ అమెరికా, ఇతర ఆసియా, ఐరోపా దేశాలకూ విస్తరించాలని ప్రణాళికలు రచించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఆ ఎగుమతుల్లో మూడింట ఒక వంతు
EV పరిశ్రమను రాష్ట్రంలో ప్రోత్సాహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ 2023ని ఆవిష్కరించింది. దేశంలోని ఆటోమోటివ్ ఎగుమతుల్లో దాదాపు మూడింట ఒక వంతు వాటా తమిళనాడు సొంతం. ఇప్పుడు EV తయారీని మరింత పెంచాలని చూస్తోంది. తాజా పాలసీ ప్రకారం EVలకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పర్మిట్ ఫీజులను మాఫీ చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications