Ola Electric: వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు దేశ ప్రజలు షిఫ్ట్ అవుతున్న వేళ.. దేశీయ ఓలా దూకుడు పెంచింది. వివిధ ఆదాయ వర్గాలను టార్గెట్ చేస్తూ నయా మోడళ్లను లాంచ్ చేస్తోంది.
ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1Xని విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ Diamondhead, Adventure, Roadster, Cruiser ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్లను ప్రివ్యూ చేసింది. ఇవి 2024లో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త S1X రెండు బ్యాటరీ ఎంపికల్లో ప్రారంభించబడింది. వీటి ప్రారంభ ధర రూ.79,999గా నుంచి రూ.99,999 మధ్య మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

2kWh బ్యాటరీతో బేస్ మోడల్, 3 kWh బ్యాటరీ మోడల్, S1 X+ పెద్ద బ్యాటరీ వేరియంట్ల ధరలు వేరువేరుగా ఉన్నాయి. తేలికైన బ్యాటరీ, మెరుగైన థర్మల్ పనితీరు, అదనపు భద్రతతో కూడిన S1X ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. అలాగే గంటకు గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఎక్కువ మోడళ్లు ప్రజలకు వారి బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా అనేక ఎంపికలను అందిస్తాయని సీఈవో భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
ఓలా ఎలక్ట్రిక్ 2023 చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. అలాగే ఓలా మ్యాప్స్, టెంపర్ అలర్ట్, హిల్ డిసెంట్, ఫైండ్ మై స్కూటర్, జియోఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్తో సహా 100కి పైగా మెరుగుదలలు, 20 కంటే ఎక్కువ కొత్త ఫీచర్లతో కంపెనీ MoveOS4 అప్డేట్ను పరిచయం చేసింది. 2021 జనవరిలో కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి మార్చి 2023 వరకు ఓలా మెుత్తంగా 3 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. టైర్-2,3 నగరాలు ప్రధానంగా ఉత్తరాధి నుంచి డిమాండ్ అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications