Indian Dressing: ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కాగా ఈసారి ఆయన వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం జనరేషన్ కు పలు సూచనలు ఇచ్చారు. తాను కూడా వాటినే అనుసరిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అవి కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
విదేశీ వస్త్రాలంకరణ వదిలేసి భారతీయులు కుర్తా వంటి వాటిని ధరించాలని ఓలా CEO పిలుపునిచ్చారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన భారతీయ వస్త్రాలైన కుర్తాలు చర్మానికి, శరీరానికి సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ఇది ఇండియన్స్ కి ఉన్న ప్రత్యేక ఫ్యాషన్ సెన్స్ అని పేర్కొన్నారు. యువ సాంకేతిక నిపుణులు, టెక్కీలు వీటిని ధరించడం అలవాటు చేసుకోవాలని కోరారు.

టెక్ ఇండస్ట్రీలో నడుస్తున్న ఐకానిక్ ఫ్యాషన్ ట్రెండ్ పై కూడా ఆయన మాట్లాడారు. ఇందుకోసం స్టీవ్ జాబ్స్ టర్టిల్నెక్ మరియు జెన్సన్ హువాంగ్ లెదర్ జాకెట్లను ఉదాహరణగా చూపారు. అదేవిధంగా భారతీయులు కూడా మన సంస్కృతీ, సాంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తులు ధరిస్తే బావుంటుందన్నారు. కుర్తాలు సౌకర్యవంతంగానే కాకుండా వేసవిలో స్టైలిష్ గా కూడా ఉంటాయని కితాబిచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ సహా పలు సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ గా మారింది. పలువురు పారిశ్రామికవేత్తలు, సోషల్ మీడియా యూజర్లు భవిష్ సూచనలపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భారతీయుతను టెక్ ఇండస్ట్రీకి అనుసంధానించడంలో ఇదొక మొదటి అడుగుగా చెబుతున్నారు. ఎప్పుడూ వ్యాపార ధోరణి కాకుండా దేశం గురించి కూడా ఆలోచిస్తున్న యువ పారిశ్రామికవేత్త ఐడియాలజీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications