కరోనా వేరియంట్ ఒమిక్రాన్, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత నాలుగు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ నెలలో 70 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధరలు ఓ సమయంలో 140 డాలర్లకు చేరుకొని, ప్రస్తుతం 110 డాలర్ల వద్ద ఉన్నాయి. అంటే యుద్ధం సమయంలో డబుల్ అయి, ప్రస్తుతం 50 శాతం పెరుగుదలతో ఉన్నాయి. దీంతో వివిధ దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మన వద్ద ఈ నాలుగు నెలలుగా ధరల్లో మార్పులేదు. ఇందుకు ఎన్నికలు ప్రధాన కారణం. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా భారీ పెరుగుదల నమోదు కాలేదు. ఇందుకు సామాన్యులపై భారం మోపకుండా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు గాను రష్యా వంటి దేశాలతో తక్కువ ధరకే ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. గత నాలుగు రోజుల్లో మూడు రోజులు స్వల్ప పెరుగుదలతో సాగుతున్నాయి.
అంతర్జాతీయ పెరుగుదలకు అనుగుణంగా చమురు రంగ కంపెనీలు గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు. దీంతో దేశీయ చమురు రంగ కంపెనీలకు రూ.19,000 కోట్లు లేదా 2.25 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు మూడీస్ అంచనా వేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుండి పెరగలేదు. అంతకు రెండో రోజుల ముందు కేంద్రం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 సెస్ను తగ్గించి ఊరట కల్పించింది. ఈ వారంలో పెరుగుదల ప్రారంభమైంది.

నవంబర్ నెల చివరి నాటికి 82 డాలర్లుగా ఉన్న బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 110 డాలర్ల వద్ద ఉంది. దీంతో చమురు కంపెనీలు ఒక్కో బ్యారెల్కు రూ.1900 లేదా 25 డాలర్లు, డీజిల్ పైన 24 డాలర్లు లేదా 1800 డాలర్లకు పైగా నష్టపోతున్నట్లు మూడీస్ అంచనా వేసింది. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోతే రోజుకు ఆయా కంపెనీలు 65 నుండి 70 మిలియన్ డాలర్ల మేర నష్టపోతాయని పేర్కొంది. నవంబర్ నుండి మార్చి తొలి వారం వరకు జరిగిన అమ్మకాల ఆధారంగా సగటును లెక్కగట్టిన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్క మార్చిలోనే తొలి మూడు వారాల్లో 2.25 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు మూడీస్ పేర్కొంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధి మూసివేత.. సముద్ర జల్లాలోకి ఏ దేశం నౌక వచ్చినా పేల్చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన..

Strait of Hormuz: భారత్కు అమెరికా బంపర్ ఆఫర్.. చమురు సంక్షోభం నుంచి భారత్ సేఫ్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications