ఇరాన్ పడవలు, క్షిపణి స్థావరాలపై అమెరికా దాడులు.. భారీగా పెరిగిన చమురు ధరలు..

ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇంకా తుది ఒప్పందం కుదరకపోవడం, అదే సమయంలో దక్షిణ ఇరాన్‌లో అమెరికా సైనిక చర్య ప్రారంభించడం వల్ల మార్కెట్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావంతో మంగళవారం ఆసియా మార్కెట్లలో ముడి చమురు ధరలు పుంజుకున్నాయి.

అంతకుముందు సోమవారం నాడు 7 శాతం భారీ పతనాన్ని చవిచూసిన బ్రెంట్ ముడి చమురు ధరలు.. తాజాగా 1.5 శాతం పెరిగి బ్యారెల్‌కు $97.56 వద్ద ట్రేడ్ అయ్యాయి. మరోవైపు అమెరికాలో మెమోరియల్ డే సెలవుదినం కారణంగా సోమవారం మార్కెట్లు మూసివేయబడిన నేపథ్యంలో.. యూఎస్ ముడి చమురు (WTI) శుక్రవారం నాటి ధరల కంటే సుమారు 5.5 శాతం తక్కువగా ఉండి, బ్యారెల్‌కు $91.25 వద్ద స్థిరపడింది.

Brent crude price oil prices today Brent rises 2 US Iran conflict Iranian missile launch sites US military strikes Iran crude oil rally global oil market news Strait of Hormuz tensions Middle East crisis Brent crude latest news oil supply disruption fears Iran boats attack energy market update crude oil surge geopolitical tensions oil prices Gulf conflict news international crude prices US airstrikes Iran oil market volatility

మరోవైపు, ఇరాన్‌లో అమెరికా సైనిక దాడులను ప్రారంభించింది. తమ సైనికులను రక్షించుకోవడానికే దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ స్థావరాలు, అలాగే మందుపాతరలు అమర్చే పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఇరాన్ మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. బందర్ అబ్బాస్ మరియు వ్యూహాత్మక ప్రాంతమైన హార్ముజ్ జలసంధి పరిసరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి.

ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో విదేశీ నౌకల రాకపోకలను దాదాపుగా అడ్డుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం చమురు, గ్యాస్ సరఫరాలలో సుమారు 20 శాతం కేవలం ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఆంక్షల కారణంగా ఈ సరఫరా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవ్వడమే కాకుండా, అంతర్జాతీయంగా చమురు ధరలు ఏకంగా 50 శాతం మేర పెరగడానికి దారితీసింది.

Also Read

ఈ తీవ్ర సంక్షోభం మధ్యే యుద్ధాన్ని నివారించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అమెరికాతో సాధ్యమయ్యే ఒక శాంతి ఒప్పందంపై చర్చలు జరపడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి, ఆ దేశ ప్రధాన సంధానకర్త సోమవారం నాడు ఖతార్ రాజధాని దోహాకు చేరుకున్నారు. ప్రస్తుతానికి ఘర్షణలను నిలిపివేసి, సమస్యకు తుది పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరు దేశాలకు 60 రోజుల పాటు గడువు ఇచ్చే ఒక ప్రాథమిక ఒప్పందంపై పురోగతి సాధించినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి.

జపాన్ మీడియా నివేదికల ప్రకారం, ఈ ప్రాథమిక ఒప్పందంలో భాగంగా ఇరాన్ రాబోయే 30 రోజుల్లోగా హార్ముజ్ జలసంధిలో తాము అమర్చిన ల్యాండ్‌మైన్‌లను (మందుపాతరలను) తొలగించాల్సి ఉంటుంది. దీనివల్ల అన్ని దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం గనుక కుదిరితే, చాలా కాలంగా సముద్రంలో నిలిచిపోయిన చమురు ట్యాంకర్లు మళ్లీ కదలడం ప్రారంభిస్తాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎల్ఎన్జి (LNG), ముడి చమురును మోసుకెళ్తున్న అనేక నౌకలు భారతదేశం, చైనా, పాకిస్థాన్ వైపు ప్రయాణించినట్లు నౌకా డేటా ద్వారా స్పష్టమవుతోంది.

ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లో మళ్లీ ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్న యురేనియంను పూర్తిగా నాశనం చేయడం కోసం అమెరికాకు అప్పగించాలనే పాత డిమాండ్‌ను ట్రంప్ తాజాగా పునరుద్ఘాటించారు. గతంలో చాలాసార్లు జరిగినట్లుగానే, ట్రంప్ పెట్టిన ఈ కఠినమైన షరతు వల్ల ఈ శాంతి ఒప్పందం కూడా చివరి నిమిషంలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+