పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆల్ టైమ్ గరిష్టానికి, ముంబైలో రూ.92 క్రాస్
న్యూఢిల్లీ: చమురు ధరలు బుధవారం (జనవరి 27) సరికొత్త గరిష్టాలను తాకాయి. పలు ముఖ్య నగరాల్లో ధరలు రూ.90 మార్కును దాటాయి. గత పది వారాల్లో పెట్రోల్ పన రూ.5.25, డీజిల్ పైన రూ.6.25 చొప్పున పెరిగింది. దీంతో ధరలు సరికొత్త గరిష్టాలను తాకాయి. నేడు పెట్రోల్ ధరలు 22 పైసల నుండి 25 పైసల మధ్య, డీజిల్ 25 పైసల నుండి 27 పైసల మధ్య పెరిగింది.
మార్చి తర్వాత రూ.5, రూ.10, రూ.100 నోట్లు చెల్లవా? ప్రభుత్వం ఏమంటోంది
ఏ నగరంలో ఎంతంటే
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు 25 పైసలు పెరగడంతో రూ.86.05 నుండి రూ.86.30గా ఉంది. డీజిల్ ధర 76.48కు చేరుకుంది. కోల్కతాలో పెట్రోల్ 24 పైసలు పెరిగి రూ.87.69, డీజిల్ పైన 25 పైసలు పెరిగి రూ.80.08కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.92.86, డీజిల్ రూ.83.30, చెన్నైలో పెట్రోల్ రూ.88.82, డీజిల్ రూ.81.71కి పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.83.46కు చేరుకుంది.
గత పది వారాల్లో పెట్రోల్ పన రూ.5.25, డీజిల్ పైన రూ.6.25 చొప్పున పెరగగా, 2021 సంవత్సరంలో పెట్రోల్ పైన రూ.2.59, డీజిల్ పైన రూ.2.61 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో జంప్
దాదాపు నెలరోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు జనవరి 6వ తేదీ నుండి తిరిగి పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలు కూడా ధరలను సవరిస్తున్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధరలు బ్యారెల్కు 11 సెంట్లు పెరిగి 56.02 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 10 సెంట్లు పెరిగి 52.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
సరికొత్త గరిష్టాలకు...
2018 నవంబర్ నెలలో ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.89.06, డీజిల్ రూ.82.53. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఆ తర్వాత ఇటీవల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముంబై వంటి చోట్ల పెట్రోల్ ధర రూ.92ను క్రాస్ చేసింది. జనవరి మొదటి 21 రోజుల్లో 9.65 కోట్ల లీటర్ల పెట్రోలు, 18.73 కోట్ల లీటర్ల డీజిల్ విక్రయాలు జరగగా, గత ఏడాదితో పోలిస్తే దాదాపు పెట్రోల్ దాదాపు పది శాతం, డీజిల్ దాదాపు ఏడు శాతం అధికంగా విక్రయించారు.