Rice Exports Ban: ప్రపంచంలో అత్యధిక బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ మెుదటి స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం ఇండియాలో పెరుగుతున్న బియ్యం ధరలను అరికట్టేందుకు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.
ఈ నిర్ణయం అనేక దేశాలను ఆందోళనలోకి నెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బియ్యం ధరలు వేగంగా పెరుగుతాయని భయాలు మెుదలయ్యాయి. ఇదే క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సైతం దీనివల్ల ప్రభావితం అవుతున్నారు. దీంతో అనేక మంది ఎక్కువ సంఖ్యలో ప్రధాన ఆహారమైన బియ్యం కొనుగోలు చేసేందుకు స్టోర్ల వద్ద క్యూ కడుతున్నారు.

భారత ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎగుమతులు నిలిచిపోతాయని.. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తుందని అమెరికాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్లోసరీ స్టోర్లలో ఒక్కొక్కరు 10 నుంచి 15 సంచులను కొనుగోలు చేస్తున్నారు. స్టోర్లలో షెల్ఫ్ పైకి ఎక్కి బియ్యం సంచులను దింపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే చాలా మంది బియ్యం కొనుగోలు చేసేందుకు స్టోర్ల బయట బారులు తీరారు.
కొంత మంది అతితెలివైన వారు 100 నుంచి 200 కిలోల బాస్మతీ బియ్యం కొనుగోలు చేసి స్టాక్ పెట్టారని, వీరిలో కొందరు వాటిని ఫేస్ బుక్ మార్కెట్ ప్లేస్ లో తిరిగి అమ్ముతున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన బెనిన్ భారత్ నుంచి బాస్మతీయేతర బియ్యాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో ఒకటిగా ఉంది. ఇదే క్రమంలో మనదేశం నుంచి అధికంగా నేపాల్, బంగ్లాదేశ్, చైనా, కోట్ డి ఐవోయిర్, టోగో, సెనెగల్, గినియా, వియత్నాం, జిబౌటి, మడగాస్కర్, కామెరూన్ సోమాలియా, మలేషియా, లైబీరియా, UAEలు తెల్ల బియ్యం దిగుమతి చేసుకుంటున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications