UPI News: ఫోన్‌పే, గూగుల్‌పే యూజర్స్‌కు NPCI చీఫ్ ఝలక్.. UPI పేమెంట్స్‌పై ఛార్జీలు..?

Payments: చెల్లింపుల వ్యవస్థలో భారత్ ఓ కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. UPI ద్వారా కేవలం సెకన్ల వ్యవధిలో నగదు బదిలీ చేయడం సులభతరం అయింది. NEFT మరియు RTGS వంటి పేమెంట్ మోడ్స్‌కు ధీటుగా నిలబెట్టింది. అయితే ఈ సేవలు ఉచితంగానే అందుకోగలగడం ఓ పెద్ద బెనిఫిట్‌గా చెప్పుకోవచ్చు.

దేశ ప్రజలకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చీఫ్ దిలీప్ తాజాగా షాక్ ఇచ్చారు. UPI ఆధారిత చెల్లింపుల కోసం భవిష్యత్తులో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బాంబ్ పేల్చారు. కొత్త ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి, వినియోగదారుల సంఖ్యను పెంచడానికి మరియు క్యాష్‌బ్యాక్‌ల వంటి ప్రోత్సాహకాలను అందించడానికి సహేతుకమైన ఛార్జీలు విధించబడవచ్చని పేర్కొన్నారు.

NPCI chief initimation on charges for UPI payments

వచ్చే మూడేళ్లలో వారు UPI ఆధారిత చెల్లింపులకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందరూ నగదుకు ప్రత్యామ్నాయ చెల్లింపులను అందించడం ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఆమోదాన్ని పెంచడంపై దృష్టి సారించాయన్నారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ (BCAS) నిర్వహించిన ఓ కార్యక్రమంలో NPCI చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఈ లావాదేవీల కోసం ఇండస్ట్రీ ప్లేయర్స్‌కు పరిహారం చెల్లిస్తోంది. దీంతో ఇప్పటివరకు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఇది వ్యవస్థ వృద్ధికి ఎంతగానో సహాయపడింది. అయితే UPI సేవలపై ఛార్జీలు విధిస్తే వివాదాలు చెలరేగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేమెంట్ వ్యవస్థలో లేనిపోని అవరోధాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+