ఎస్సెమ్మెస్ ద్వారా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు
జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట. చిన్న వ్యాపారులకు జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసే మరో ప్రక్రియను సులభతరం చేశారు. కాంపోజిట్ పన్ను చెల్లింపుదారులు తమ జీఎస్టీ రిటర్న్స్ను ఎస్సెమ్మెస్ ద్వారా దాఖలు చేయవచ్చు. ఈ సేవలను పొందడానికి ట్యాక్స్పేయర్స్ జీఎస్టీ ఫారంలోని సీఎంపీ-08 ద్వారా నిల్ స్టేట్మెంట్ను దాఖలు చేయవచ్చు.
సీఎంపీ-08ను కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ చేయాల్సిన స్వీయ అంచనా పన్ను త్రైవార్షిక స్టేట్మెంట్గా పరిగణించవచ్చు. ఈ కొత్త విధానంతో పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇకపై జీఎస్టీ పోర్టల్కు లాగిన్ కావాల్సిన అవసరం లేదు. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. కానీ పన్ను ప్రయోజనం పొందాలంటే నర్దేశిత ఫార్మాట్లో ఎస్సెమ్మెస్ చేయాలి.
కాంపోజిషన్ స్కీం కింద 17.11 లక్షల ట్యాక్స్పేయర్స్ రిజిస్టర్ అ్యారు. ఇందులో 20 శాతం లేదా 3.5 లక్షల మంది ట్యాక్స్పేయర్స్ నిల్ రిటర్న్స్. అంటే ఎలాంటి జీఎస్టీ బకాయిలు లేని చిన్న వ్యాపారులు లేదా చిన్న వ్యాపార సంస్థలు కేవలం ఒక ఎస్సెమ్మెస్ పంపించడం ద్వారా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. కానీ పన్ను చెల్లించాల్సిన సంస్థలకు ఈ ప్రయోజనం లేదు.