ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు యోనో యాప్ ద్వారా ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ఎస్బీఐ తాజాగా ప్రకటన చేసింది. యోనో ప్లాట్ఫాం ద్వారా తాము ఎలాంటి లోన్ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఇదీ విషయం.. కానీ ఇవ్వడం లేదు
ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రూ.5 లక్షల వరకు ఎమర్జెన్సీ లోన్స్ ఇస్తోందని, ఈ ప్లాట్ఫామ్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే డబ్బులు మంజూరు చేస్తోందని వార్తలు వచ్చాయి. వీటికి 10.5 శాతం వడ్డీ మాత్రమేనని, ఈ ఈఎంఐని కూడా తీసుకున్న ఆరు నెలల తర్వాత నుండి చెల్లించడం ప్రారంభించవచ్చునని కూడా వచ్చాయి. అయితే వదంతులేనని, మీడియాలో కూడా వార్తలు వచ్చాయని, తాము ఇవ్వడం లేదని తెలిపింది.

వారికి మాత్రమే.. ప్రయత్నాలు
తమ బ్యాంకు ఖాతా ద్వారా వేతనం పొందేవారికి, ముందస్తుగా ఆమోదించిన పర్సనల్ లోన్స్ను మాత్రమే యోనో ప్లాట్ ఫామ్ పైన అందించే ప్రయత్నాలు సాగుతున్నాయని ఎస్బీఐ తెలిపింది. కానీ కరోనా కారణంగా ఎమర్జెన్సీ రుణాలు ఇస్తున్నామనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. యోనో యాప్ ద్వారా ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ప్రవేశపెట్టే ప్రయత్నంలో మాత్రమే ఉన్నట్లు చెప్పింది.

డిజిటల్ సర్వీస్ ప్లాట్ఫామ్.. యోనో
యోనో యాప్ (You Only Need One) ఎస్బీఐ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్. కస్టమర్లకు బ్యాంకింగ్కు సంబంధించి ఇది ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. షాపింగ్, లైఫ్స్టైల్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి సేవలు ఈ యాప్ ద్వారా లభిస్తాయి. ఈ యాప్ నుండే కరోనా కారణంగా నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న తమ కస్టమర్లకు ఊరట
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications