Kannadiga Row: బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే బెంగళూరు నగరంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు తగులుతూనే ఉంటారు. కొత్తగా నగరానికి వచ్చినవారికి కూడా ఇది కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటారు.
ఈ క్రమంలో గడచిన కొన్ని నెలలుగా కర్ణాటక వ్యాప్తంగా కన్నడిగ నినాదం వినిపిస్తోంది. స్థానికులకే ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో అగ్రస్థానం కల్పించాలని వారు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం సైతం ఒక బిల్లును తీసుకొచ్చింది. అయితే పరిశ్రమ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో దానిని కొన్ని గంటల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది మరువక మునుపే గతవారం సోషల్ మీడియాలో కన్నడిగులకు ఉద్యోగాల నియామకంలో ప్రాథాన్యత ఇవ్వాలంటూ ట్వీట్ సంచలనం రేపింది.

కర్ణాటకలో యువత ఉద్యోగాల కోసం రోడ్లపై యుద్ధం చేయకుండా.. నియమించుకునే స్థాయిలో ఉన్న కీలక ఉద్యోగులు, వ్యవస్థాపకులు పొరుగువారిపై కనికరం చూపకుండా కన్నడిగులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఒక వ్యక్తి చేసిన ట్వీట్ పెద్ద చర్చకు దారితీసింది. దీని తర్వాత తాజాగా ఇదే అంశంపై మరోసారి పెద్ద చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిపై చేసిన వీడియో వైరల్ అవుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భాష, సాంస్కృతిక చర్చలో కన్నడిగులకు తన మద్దతును అందించాడు.
కర్ణాటక ఈ విషయంలో సరైన వైపున వాదిస్తోందని అన్నాడు. ప్రస్తుతం కర్ణాటక ప్రజలపై చాలా ద్వేషం పెరుగుతోందని, అయితే వారి భూమి, వారి సంస్కృతి, వారి వారసత్వం, వారి గుర్తింపును కాపాడుకునే హక్కు వారికి ఎల్లప్పుడూ ఉంటుందని సదరు వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశాడు. కర్ణాటక సాంస్కృతిక పోరాటాన్ని కెనడా వలస ప్రకృతి దృశ్యంతో పోల్చి, పెద్ద ఎత్తున వలసలు ఎలా ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయో ఆయన గుర్తు చేశాడు. ప్రస్తుతం పంజాబీలు, ఉత్తర భారతీయుల పట్ల కూడా ఇలాంటి ద్వేషం కనిపిస్తోందని అన్నాడు.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐటీ కంపెనీలు కేవలం స్థానిక భాష మాట్లాడుతూ ఇంగ్లీషు మాట్లాడలేని వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకుంటే క్లయింట్లతో ఎలా కమ్యూనికేట్ చేయటం కుదురుతుందని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. అయితే కన్నడిగులకు ప్రాధాన్యత అంశం రోజురోజుకూ పెద్ద చర్చగా మారుతున్న వేళ బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న తెలుగు కుటుంబాలు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నాయి. ఉద్యోగ భద్రతతో పాటు ఈ అంశం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదాలపై వారు భయం వ్యక్తం చేస్తున్నారు. బతుకు జీవుడా అంటూ తిరిగి సొంటూళ్లకు రావాల్సిన పరిస్థితి వస్తే ఎలా అనే డైలమాలో ఉన్నారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications