Tech News: దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలోని కొన్ని కంపెనీల తీరు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. కంపెనీలు చూపిస్తున్న వివక్షకు సంబంధించిన తాజా పరిణామం ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారింది. అయితే కంపెనీలు ఇలా ఎందుకు చేస్తున్నాయనే ప్రశ్నలు మార్తం తమ జవాబుకోసం వెతుకుతూనే ఉన్నాయి.
నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న మౌనీ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ తీరుపై టెక్కీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సంస్థ తన లింక్డ్ఇన్లో వివక్షతతో కూడిన జాబ్ లిస్టింగ్ను పోస్ట్ చేసిన తర్వాత విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాము డేటా అనలిస్ట్ పాత్రకు ఉద్యోగి కోసం వెతుకుతున్నామని వెల్లడించిన సంస్థ అందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలను అనర్హులుగా పేర్కొంది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాలకు చెందిన టెక్కీలను నియమించుకోమంటూ సంస్థ బాహాటంగానే ఉద్యోగ ప్రకటనలో వెల్లడించటం పెద్ద చర్చకు దారితీసింది.

మౌనీ కన్సల్టింగ్ సంస్థ తన ఉద్యోగ పోస్టింగ్లో 4 ఏళ్లు అనుభవం కలిగిన టెక్కీల కోసం వెతుకుతున్నట్లు పేర్కొంది. అలాగే పనిలో భాగంగా వివిధ వాటాదారులతో కలిసి పనిచేయటం, డేటా సొల్యూషన్లను అందించడం వంటి బాధ్యతల గురించి వెల్లడించింది. దక్షిణ భారత అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న మినహాయింపు నిబంధనకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్లో స్క్రీన్షాట్ షేర్ చేయబడిన తర్వాత నియామక పద్ధతులలో వివక్ష గురించి విస్తృత చర్చ కొనసాగుతోంది.
దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే జాబ్ పోస్టులో రిక్రూటింగ్ సంస్థ హిందీ రాయటం, మాట్లాడటంపై పట్టు ఎక్కువగా ఉండాలని కోరినందున దక్షిణాది రాష్ట్రాల ప్రజలను మినహాయించిందని ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో వ్యక్తి స్పందిస్తూ ప్రస్తుతం సౌత్ ఇండియన్స్ కూడా ప్రస్తుతం హిందీ మాట్లాడటం, రాయటంలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారని, అయితే చివరిలో రిక్రూటింగ్ సంస్థ ప్రత్యేకంగా నోట్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని అభఇప్రాయపడ్డారు. మరికొందరైతే ప్రత్యేకంగా నిషేధం సరైనది కాదని సరైన స్కిల్స్ ఉన్న ఎవ్వరినైనా కంపెనీ రిక్రూట్ చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నందున ఇలా వివక్ష చూపటం సరైనది కాదని పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో సౌత్ సూపర్..
దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఎగుమతులను వివిధ టెక్నాలజీ పార్కుల నుంచి ఎంత ఉందనే వివరాలను పరిశీలిస్తే.. టాప్-10 స్థానాల్లో తొలి స్థానంలో బెంగళూరు రూ.4.07 లక్షల కోట్ల ఎగుమతులను కలిగి ఉంది. ఇక రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ రూ.1.21 లక్షల కోట్లు, పూణే రూ.1.05 లక్షల కోట్లు, చెన్నై రూ.77.42 వేల కోట్లు, ముంబైలో రూ.76.56 వేల కోట్లు, గురుగ్రాము రూ.52.93 వేల కోట్లు, నోయిడా రూ.50.11 వేల కోట్లు, కలకత్తా రూ.13.02 వేల కోట్లు, గాంధీనగర్ రూ.8.63 వేల కోట్లు, తిరువనంతపురం రూ.5.31 వేల కోట్ల ఎగుమతులను కలిగి ఉన్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications