రూ.50 నాణెంపై కేంద్రం కీలక ప్రకటన..ఇంతకీ వస్తుందా..రాదా.. ప్రభుత్వం ఏ చెప్పిందంటే..

Rs 50 coin Latest News: గత కొన్ని రోజులుగా రూ.50 నాణెం వస్తుందంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. తాజాగా 50 రూపాయల నాణెం ప్రవేశపెట్టడంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా.. ప్రస్తుతం రూ.50 నాణెం ప్రవేశపెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ప్రజలు భారీ నాణేలకంటే నోట్లనే ఇష్టపడతారని, అందుకే కొత్త నాణెంపై ప్రణాళిక లేదని తెలిపింది.

న్యాయవాది రోహిత్ దండరియాల్ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా ఆర్థిక శాఖ నుంచి ఈ ప్రకటన వెలువడింది. అంధుల కోసం ప్రత్యేకంగా రూ.50 నాణెం విడుదల చేయాలని ఆయన కోర్టు ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.దానికి స్పందిస్తూ మంత్రిత్వ శాఖ 2022లో ఆర్‌బీఐ చేసిన సర్వేను ప్రస్తావించింది. ఆ సర్వే ప్రకారం ప్రజలు నాణేల బరువు, పరిమాణం, గుర్తింపు ఇబ్బందుల వల్ల వాటిని ఎక్కువగా ఉపయోగించడం లేదు. వారంతా నోట్లను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. రోజువారీ లావాదేవీలకు అవే అనుకూలంగా ఉంటాయని తేలిందన్నారు.

Rs 50 coin 50 coin news Centre on 50 rupee coin Delhi High Court currency case Indian currency updates coin vs banknote preference RBI currency policy Indian government on new coins no plan for 50 coin public prefers banknotes 50 50 50 vs 50 50 Rs 50 coin

ఇక తన పిటిషన్లో న్యాయవాది దండరియాల్.. 50 రూపాయల నోటులో స్పర్శ లక్షణాలు లేకపోవడం వల్ల అంధులకు దాన్ని గుర్తించడం సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఇతర నోట్లలో ఉండే ఎంబోస్డ్ ప్రింటింగ్, వేరే పరిమాణాలు 50 రూపాయల నోటులో లేకపోవడం వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి అంధుల కోసం ప్రత్యేకంగా రూ.50 నాణెం విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ అనీష్ దయాల్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ మీద స్పందించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్రం కోర్టుకు తన అఫిడవిట్‌ ద్వారా తెలిపింది. నోట్ల వినియోగం రోజువారీ లావాదేవీల్లో సులభతరం కావడంతో ప్రజలు వాటిని ఇష్టపడుతున్నారు.

కొత్త నాణెం ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వం ప్రజల అభిప్రాయం, అవసరాలు, ఆర్థిక ప్రభావాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 నాణెం అవసరం లేదని కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. దీనిపై స్పందించేందుకు పిటిషనర్‌కు సమయం ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

ఇక ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం పాత, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు కలిపి వాడుతున్నందున దృష్టి లోపం ఉన్న వారికి కొంత గందరగోళం ఏర్పడుతున్న మాట వాస్తవమే. అయితే ఎక్కువ నోట్లపై ఉన్న ప్రత్యేకతలు అంధులకు సాయపడుతున్నాయని కూడా ప్రభుత్వం గుర్తించింది. కానీ ప్రత్యేకంగా రూ.50 నోటులో మాత్రం అలాంటి లక్షణం లేనందున ఇది సమస్యగా మారిందని తెలిపింది.

ఏదేమైనా ప్రస్తుతం రూ.50 నాణెం ప్రవేశపెట్టే అవసరం లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించినప్పటికీ, అంధుల అవసరాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తుదినిర్ణయం సెప్టెంబర్ 17 విచారణ తర్వాత వెలువడే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+