జియోను ఆ బకాయిలు ఎందుకు అడగొద్దు: సుప్రీంకోర్టు, ఏ ఆధారమూ లేదు.. రిలయన్స్ జియో

2016లో దివాళా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(RCom)కు సంబంధించిన స్పెక్ట్రంను ఉపయోగించుకున్నందుకు ఆ సంస్థ బాకీలను రిలయన్స్ జియో సంస్థ కట్టాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఆర్‌కామ్‌కు సంబంధించి దివాళా ప్రక్రియ కొనసాగుతోన్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ(DoT), కార్పోరేట్ వ్యవహారాల శాఖ(MCA) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి కేంద్రం తన స్టాండ్ చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం ప్రశ్నించింది.

శాఖల మధ్య భేదాభిప్రాయాలు.. కేంద్రం స్టాండ్ ఏమిటి

శాఖల మధ్య భేదాభిప్రాయాలు.. కేంద్రం స్టాండ్ ఏమిటి

రెండు మంత్రిత్వ శాఖల మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ జియోపై కేంద్రం తన వైఖరి తెలపాలని సుప్రీం కోర్టు కోరింది. ఏజీఆర్‌కు సంబంధించిన బకాయిలను చెల్లించాలని రిలయన్స్ జియోను ఎందుకు అడగరాదో చెప్పాలని ప్రశ్నించింది. స్పెక్ట్రం విక్రయ అంశంపై టెలికం విభాగం, కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. దీంతో కేంద్రం స్టాండ్ ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కేంద్రం, డాట్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. మంగళవారం నాటికి ఏడాది వారిగా ఆర్.కామ్. బకాయిలను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఈ రోజు విచారణ కొనసాగనుంది.

భేదాభిప్రాయం ఇక్కడే..

భేదాభిప్రాయం ఇక్కడే..

దివాళా ప్రక్రియ కొనసాగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి వీల్లేదనేది డాట్ అభిప్రాయం కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సోమవారం తెలిపారు.

చట్టబద్దమైన ఆధారం లేదు..

చట్టబద్దమైన ఆధారం లేదు..

రిలయన్స్ కమ్యూనికేషన్స్ బకాయిలు కట్టాలని తమకు చెప్పడానికి ఎలాంటి చట్టబద్దమైన ఆధారం లేదని సుప్రీం కోర్టుకు రిలయన్స్ జియో తెలిపింది. 2016 నుండి ఆర్.కామ్. స్పెక్ట్రంను ఉపయోగిస్తున్నందున దాని బకాయిలు ఎందుకు చెల్లించరాదో చెప్పాలని ఆగస్ట్ 14న సుప్రీం కోర్టు.. జియోను ప్రశ్నించింది. దీనికి రిలయన్స్ సోమవారం రాతపూర్వక సమాధానం సమర్పించింది. ఆర్.కామ్.తో ఎలాంటి స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందం లేదని, ఇందుకు మార్గదర్శకాలు ఉన్నాయని, కాబట్టి బకాయిలు చెల్లించాలని చెప్పడానికి ఎలాంటి లీగల్ ఆధారం లేదని తెలిపింది. స్పెక్ట్రం షేరింగ్ 5 సెప్టెంబర్ 2016 నుండి ప్రారంభమైందని, ఇది కూడా కేవలం 4జీ సేవలకు మాత్రమేనని, 2జీ, 3జీ సేవలకు సంబంధించి కాదని తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రంను సరళీకృతం చేసేందుకు ఆర్.కామ్. రూ.6,627 కోట్లు చెల్లించిందని, షేరింగ్ అగ్రిమెంట్ సమయంలో ప్రభుత్వానికి ఈ మొత్తం వచ్చిందని తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+